S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కొలంబో, మార్చి 13: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా భారత్, శ్రీలంక శుక్రవారం నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత్కు వ్యూహాత్మక పొరుగుదేశంగా ఉన్న శ్రీలంకతో సంబంధాలను పెంపొందించుకునేందుకు చేపట్టనున్న పలు చర్యలను మోదీ ఈ సందర్భంగా ప్రకటించారు.
సిడ్నీ, మార్చి 13: ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన నామమాత్రపు మ్యాచ్ని వర్షం కూడా వెంటాడింది. డక్వర్త్ లూయిస్ విధానం ద్వారా ఇంగ్లాండ్ 25 ఓవర్లలో 101 పరుగులు సాధించాల్సి ఉండగా, మరో 41 బంతులు మిగిలి ఉండగానే, కేవలం ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. అయితే, భారీ విజయాన్ని నమోదు చేసినప్పటికీ ఈ జట్టు ఇంటిదారి పట్టక తప్పలేదు.
అధికారాంతమునందు చూడవలదా ఆ అయ్య
సౌభాగ్యముల్-అన్న కవివాక్కులు మాజీ
ప్రధాని మన్మోహన్ సింగ్ విషయంలో ఇలా
ధ్రువపడింది. పదేళ్లపాటు ప్రధానమంత్రిత్వం
వహించిన అంతర్జాతీయ స్థాయి అర్థికవేత్త
అపరాధం చేసినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు
లభించడం మన ప్రజాస్వామ్య చరిత్రలో మరో
విపరిణామం. బొగ్గు బొరియల-కోల్బ్లాక్స్-ను
కొలంబో, మార్చి 13: అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి భారత్ సహా అమెరికా, యూరోపియన్ దేశాలే కారణమని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్స ఆరోపించారు. ఎన్నికల్లో తనను ఓడించేందుకు అమెరికన్లు, నార్వేయన్లు, యూరోపియన్లతో పాటు భారత్కు చెందిన ‘రా’ కూడా కారణమని, ఇది బహిరంగ రహస్యమని ఆయన స్పష్టం చేశారు.
కొలంబో, మార్చి 13: భారత్, శ్రీలంక దేశాల భద్రత విడదీయలేనివని ప్రధాని నరేంద్ర మోదీ అంటూ, కీలకమైన సముద్ర జలాల రక్షణ, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో తమ రెండు దేశాల మధ్య మరింత సహకారం అవసరమని నొక్కి చెప్పారు.
హైదరాబాద్, మార్చి 13: అరుదైన గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న ఇద్దరు మహిళా రోగులు శుక్రవారం సికింద్రాబాద్లోని యశోదా ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యారు. ఇద్దరు రోగులూ బ్రెయిన్డెడ్ కేసుల్లో అవయవ దానం వల్ల పునర్జన్మ పొందినవారే కావడం విశేషం. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ జిఎస్ రావు, వైద్యులు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే, శశికాంత్ విలేఖరులతో మాట్లాడారు.
హైదరాబాద్, మార్చి 13: రానున్న రెండు, మూడు నెలల్లో ఇసుక తరలింపునకు సంబంధించి ప్రత్యేక పాలసీని అమలు చేయనున్నట్లు మంత్రి హరీశ్రావు శాసన మండలిలో శుక్రవారం వెల్లడించారు.
విశాఖ:నగరంలోని నెహ్రూ చౌక్ సమీపంలో ఓ వ్యక్తి బ్యాంకు నుంచి 60 వేల రూపాయలు డ్రా చేసుకొని వెళుతుండగా గుర్తుతెలియని దుండుగులు బ్యాగ్ను లాక్కెళ్లారు.
విజయవాడ:కృష్ణాజిల్లా కైకలూరు మండలం పల్లెవాడ వద్ద లారీ, కారు ఢీకొన్న ప్రమాదంలో ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ మూర్తి మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.
హైదరాబాద్, మార్చి 13: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరానికి రూపొందించిన వ్యవసాయ బడ్జెట్ను శుక్రవారం విధాన మండలి ప్రవేశపెట్టింది. రాష్ట్ర కార్మిక, క్రీడా శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు.