నా ఓటమికి భారత్ కారణం: రాజపక్స
Published Saturday, 14 March 2015కొలంబో, మార్చి 13: అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమికి భారత్ సహా అమెరికా, యూరోపియన్ దేశాలే కారణమని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహేంద్ర రాజపక్స ఆరోపించారు. ఎన్నికల్లో తనను ఓడించేందుకు అమెరికన్లు, నార్వేయన్లు, యూరోపియన్లతో పాటు భారత్కు చెందిన ‘రా’ కూడా కారణమని, ఇది బహిరంగ రహస్యమని ఆయన స్పష్టం చేశారు. హాంకాంగ్కు చెందిన దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనను ఎన్నికల్లో ఓడించేందుకు అమెరికా, భారత్లు తమ ఎంబసీలను ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా శ్రీలంకలో పర్యటించనున్న సమయంలో రాజపక్స ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.