S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/13/2016 - 07:20

వాషింగ్టన్, ఏప్రిల్ 12: అమెరికాలో 9/11 ఉగ్రవాద దాడుల తర్వాత రిపబ్లికన్ పార్టీ అనుసరించిన వలసవాద వ్యతిరేక వైఖరి ప్రవాస భారతీయులు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గేలా చేసిందని అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్ సరళిపై తాజాగా విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది. ‘దేశీస్ డివైడెడ్: ది పొలిటికల్ లైవ్స్ ఆఫ్ సౌత్ ఏసియన్ అమెరికన్స్’ పుస్తక రచయిత సంజయ్ మిశ్రా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు.

04/13/2016 - 12:21

ఖాట్మండు, ఏప్రిల్ 12: నేపాల్‌లో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. 31 మంది గాయపడ్డారు. ఖోతంగ్ జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 300 మీటర్లలోతైన లోయలో పడిపోయింది. బర్ఖేతర్ గ్రామంలో రోడ్డుపక్కన ఉన్న లోయలోకి పల్టీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటనలో 24మంది మృతి చెందారు.

04/13/2016 - 07:18

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (నిట్)ను శ్రీనగర్‌నుంచి మార్చే ప్రసక్తి లేదని జమ్మూ,కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి దేశ రాజధాని ఢిల్లీ వచ్చిన మెహబూబా అంతకుముందు హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిశారు. కాగా, రాజ్‌నాథ్‌తో తన భేటీని ఆమె కేవలం మర్యాదపూర్వక భేటీగా అభివర్ణించారు.

04/13/2016 - 07:17

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఈ ఏడాది రుతుపవనాలు మామూలుకన్నా మించి ఉంటాయని, పుష్కలంగా వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ విభాగం మంగళవారం అంచనా వేసింది. వరసగా రెండేళ్లుగా వర్షాభావం కారణంగా వ్యవసాయ దిగుబడులు తగ్గిపోవడంతోపాటు వృద్ధి రేటు సైతం మందగించిన నేపథ్యంలో ఈ ఏడాది రుతుపవనాలు ఎలా ఉంటాయోనన్న భయాలు ఈ వార్తతో కొంతమేరకు తొలగిపోనున్నాయి.

04/13/2016 - 08:56

నాగ్‌పూర్, ఏప్రిల్ 12: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఒకేసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్)కు మోదీ ప్రభుత్వం వంతపాడుతోందని, విద్యార్థుల్లో అశాంతి తీవ్రంగా పెరగడానికి ఇదే కారణమని వారు నిప్పులు చెరిగారు.

04/13/2016 - 07:16

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులకు మంగళవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డులు ప్రదానం చేశారు. రాష్టప్రతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఓ కార్యక్రమంలో పురస్కారాలు అందజేశారు.

04/13/2016 - 07:01

హైదరాబాద్, ఏప్రిల్ 12: రాష్ట్రంలో ప్రతీ 75 వేల జనాభాకు ఒకటి చొప్పున అత్యవసర వైద్య సేవలు అందించే 108 అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం వైద్య సేవలు అందిస్తున్న 104 సంచార వైద్య వాహనాల సేవలు మరింత విస్తృతపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

04/13/2016 - 06:58

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: మిషన్ కాకతీయలాంటి పథకాలకు మహత్మాగాంధీ జాతీయ ఉపాధి కల్పన హామీ పథకం నిధుల వాటాను 60 శాతానికి పెంచాలని కేంద్ర జలవనరుల శాఖ ఉపసంఘం సిఫారసు చేసినట్టు తెలంగాణ నీటిపారుదల మంత్రి, ఉపసంఘం సభ్యుడు హరీశ్‌రావు వెల్లడించారు. పిఎంకెఎస్‌వైలో పది తెలంగాణ నీటి ప్రాజెక్టులు మొదటి ప్రాధాన్యత జాబితాలో, ఒక ప్రాజెక్టు రెండో జాబితాలో చేర్చారన్నారు.

04/13/2016 - 06:56

హైదరాబాద్, ఏప్రిల్ 12: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను నీతి ఆయోగ్ సలహాదారు పికె ఝా, డిప్యూటీ అడ్వైజర్ ఎకె జైన్‌లు అభినందించారు. పథకాలపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులతో మంగళవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రణాళికా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో అధికారులు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేశారు.

04/13/2016 - 06:50

విజయవాడ, ఏప్రిల్ 12: అక్కడ సంవత్సరానికి మూడు పంటలు పండుతాయి.. ఆ ప్రాంతంలో ఏ పొలం చూసినా పచ్చగా కళకళలాడుతూ ఉంటుంది. ప్రధాన పంటలతోపాటు అంతర్ పంటలను పండిస్తూ రైతులు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారు. పచ్చని శోభతో కళకళలాడుతున్న గుంటూరు జిల్లా ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లోని ఈ పొలాలను రాజధాని కోసం తీసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకూ అనేక ప్రయత్నాలు చేసింది. సాధ్యం కాలేదు. బలవంతంగా

Pages