S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/01/2016 - 00:10

న్యూఢిల్లీ, జూలై 31: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) గాను ప్రముఖ సంస్థలు ప్రకటించే ఆర్థిక ఫలితాలతోపాటు రాజ్యసభలో కీలకమైన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు పరిణామాలు ఈ వారం మార్కెట్ ట్రేడింగ్‌ను ప్రధానంగా ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

08/01/2016 - 00:07

న్యూఢిల్లీ, జూలై 31: ఢిల్లీ-ఎన్‌సిఆర్ పరిధిలో డీజిల్, పెట్రోల్ వాహనాలపై నిషేధం.. కొత్త వాహనాల కొనుగోళ్లకు ఊతమిస్తుందని రేటింగ్ ఏజెన్సీ ఐసిఆర్‌ఎ అభిప్రాయపడింది. ఈ ప్రతిపాదిత వాహన ఆధునికీకరణ కార్యక్రమంతో కనీసం 3 శాతం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేసింది.

08/01/2016 - 00:05

ముంబయి, జూలై 31: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని రుణపీడిత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ బకాయిలను రాబట్టుకోవడంలో భాగంగా ఆ సంస్థకు చెందిన 700 కోట్ల రూపాయలకుపైగా ఆస్తులను వేలానికి వేస్తున్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. ఎస్‌బిఐతోసహా 17 బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకుపైగా బకాయిపడినది తెలిసిందే.

08/01/2016 - 00:03

న్యూఢిల్లీ, జూలై 31: విదేశీ మదుపరులు జూలైలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి 12,600 కోట్ల రూపాయల కుపైగా పెట్టుబడులను తీసుకొచ్చారు.

08/01/2016 - 00:03

విశాఖపట్నం, జూలై 31: భారతీయ రైల్వేకు ఆర్థిక వెనె్నముకగా నిలుస్తున్న వాల్తేరు డివిజన్.. ఇపుడు సరుకు రవాణాలో అన్ని జోన్ల కంటే అగ్రగామిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16)లో 55.66 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా 6,456.84 కోట్ల రూపాయల ఆదాయాన్ని వాల్తేరు డివిజన్ సంపాదించగలిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-14) కంటే ఇది 4.82 శాతం అధికం.

07/31/2016 - 03:29

విజయవాడ, జూలై 30: అక్రమాలకు పాల్పడుతున్న పదివేల మంది వ్యాపారుల లైసెన్సులను రద్దు చేసింది చంద్రబాబు సర్కారు. తద్వారా వినియోగదారుల ప్రయోజనాలు, ప్రభుత్వ ఆదాయాన్ని దెబ్బతీస్తున్న అక్రమార్కులకు చెక్ పెట్టింది. పాలనలో సాంకేతికతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పన్నుల విధానంలో కూడా ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టింది.

07/31/2016 - 03:27

విశాఖపట్నం/గాజువాక, జూలై 30: విద్యుదుత్పత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్న హిందుజా నేషనల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌ఎన్‌పిసిఎల్) థర్మల్ ప్రాజెక్టుకు రైలు, రోడ్డు మార్గాలకు లైన్ క్లియరైంది.

,
07/31/2016 - 03:25

ముంబయి, జూలై 30: ముంబయి లోకల్ రైలు ప్రయాణికులను విలె పార్లే స్టేషన్ రాగానే ఓ కమ్మటి సువాసన పలకరిస్తుంది. పక్కనే ఉన్న పార్లే బిస్కట్ తయారీ కర్మాగారం నుంచే వస్తుంది ఆ పరిమళం. తాజా బిస్కట్లు తింటున్నట్లుండే ఆ మధురానుభూతిని ప్రయాణికులెవరూ మరిపోలేరు. అయితే ఇప్పుడు ఆ అనుభూతి కలగడం లేదు. కారణం.. చారిత్రాత్మక ఈ పార్లే బిస్కట్ల కర్మాగారం మూతబడింది కనుక. అవును..

07/31/2016 - 03:21

అనంతపురం, జూలై 30: అనంతపురం జిల్లా ఇండస్ట్రియల్ హబ్‌గా రూపాంతరం చెందబోతోంది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగంగా నిత్యం కరవు కాటకాలకు నిలయమైన, రాష్ట్రంలోనే విస్తీర్ణంలో అత్యంత పెద్దదైన అనంత పురం జిల్లా పురోభివృద్ధి కోసం పరిశ్రమల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే జిల్లాకు 19 భారీ, మధ్యతరహా పరిశ్రమలు మంజూరయ్యాయి.

07/30/2016 - 07:57

న్యూఢిల్లీ, జూలై 29: ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మదింపు సంవత్సరం 2016-17కుగాను ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు వచ్చే నెల 5 వరకు సమయం ఇచ్చింది. నిజానికి ఈ నెల 31 వరకే ఆదాయ పన్ను రిటర్స్ దాఖలుకు తుది గడువు. అయితే దీన్ని ఆగస్టు 5 వరకు పొడిగిస్తున్నట్లు శుక్రవారం రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Pages