S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/04/2016 - 08:40

విశాఖపట్నం, ఆగస్టు 3: వైద్య పరికరాల తయారీకి సంబంధించి పరిశ్రమలన్నింటినీ ఒకే ప్రాంతంలో ఏర్పా టు చేసేందుకు వీలుగా ప్రభుత్వం మెడ్‌టెక్ పార్క్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దక్షిణాసియాలోనే తొలి మెడికల్ పరికరాల ప్రాజెక్టుకు విశాఖ కేంద్రం కానుంది. పెదగంట్యాడ మండలం నడుపూరులో 270 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక వైద్య పరికరాల తయారీ జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

08/04/2016 - 08:39

హైదరాబాద్, ఆగస్టు 3: టెక్ సంస్థ ఆర్‌డిపి వర్క్‌స్టేషన్స్.. బుధవారం ఇక్కడ ‘తిన్‌బుక్’ పేరిట 14.1 అంగుళాల చౌక ల్యాప్‌ట్యాప్‌ను పరిచయం చేసింది. దీని ధర 9,999 రూపాయలు. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు దీన్ని ఆవిష్కరించారు. మైక్రోసాఫ్ట్, ఇంటెల్‌తో ఏర్పరచుకున్న వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా దీన్ని రూపొందించామని, ఇదే ఇప్పటిదాకా అత్యంత చౌక ల్యాప్‌ట్యాప్ అని కూడా సంస్థ ఈ సందర్భంగా తెలిపింది.

08/04/2016 - 08:38

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఎంతోకాలంగా వేచిచూస్తున్న మోటార్ వాహనాల (సవరణ) బిల్లు 2016ను కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదించింది. ఈ బిల్లు అమలుతో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించేవారికి భారీగా జరిమానాలు పడనున్నాయి. మద్యం సేవించి నడిపితే 10,000 రూపాయల వరకు జరిమానా, ప్రమాద తీవ్రతనుబట్టి 2 లక్షల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

08/04/2016 - 08:38

విజయవాడ, ఆగస్టు 3: ఉభయ గోదావరి జిల్లాల్లోని గృహాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు పైపులైన్ ద్వారా గ్యాస్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. గోదావరి గ్యాస్ పేరుతో ప్రారంభించనున్న ఈ కార్యక్రమంలో గెయిల్ 74 శాతం, హెచ్‌సిపిఎల్ 26 శాతం ఈక్విటీ కలిగి ఉంటాయి.

08/04/2016 - 08:37

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ద్రవ్య, ఆర్థిక విధానాల మద్దతుతో భారత వృద్ధిరేటు 8 శాతాన్ని అందుకోగలదని గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పి అభిప్రాయపడింది. రాబోయే మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశ జిడిపి వృద్ధి 8 శాతాన్ని చేరగలదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. అయితే సంస్కరణల అమలు మందగిస్తే మాత్రం వృద్ధి పతనం కాకతప్పదని హెచ్చరించింది.

08/04/2016 - 08:36

న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశీయ ఐటి రంగంలో నాలుగో అతిపెద్ద సంస్థగా ఉన్న హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో 2,047 కోట్ల రూపాయలుగా నమోదైంది.

08/03/2016 - 00:58

ముంబయి, ఆగస్టు 2: రాబోయే మూడేళ్లకుపైగా కాలంలో బాసెల్-3 నిబంధనలకు అనుగుణంగా భారతీయ ప్రభుత్వరంగ బ్యాం కులు 2.5 లక్షల కోట్ల రూపాయల మూలధనాన్ని సమీకరించుకోవాల్సి ఉందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్‌అండ్‌పి గ్లోబల్ రేటింగ్స్ మంగళవారం తెలిపింది.

08/03/2016 - 00:54

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దేశీయ ఆటోరంగ సంస్థ బజాజ్ ఆటో మోటార్‌సైకిల్ అమ్మకాలు గత నెల జూలైలో నిరుడుతో పోల్చితే స్వల్పంగా 1 శాతం పెరిగి 2,85,527 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రిందటిసారి 2,82,433 యూనిట్లుగా ఉన్నాయి. అయితే వాణిజ్య వాహనాల విక్రయాలు 7.3 శాతం తగ్గుముఖం పట్టాయి. ఈసారి 44,306 యూనిట్లుగా, పోయినసారి 47,798 యూనిట్లుగా ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో బజాజ్ ఆటో తెలియజేసింది.

08/03/2016 - 00:53

న్యూఢిల్లీ, ఆగస్టు 2: దాదాపు 58 లక్షల పెన్షనర్ల బ్యాంకు ఖాతాలు.. ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (పిఎమ్‌జెడివై) క్రిందకు రానున్నాయి. 2017 మార్చి 31 నాటికి అన్ని రాయితీలు, సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెన్ఫిట్ ట్రాన్స్‌ఫర్ (డిబిటి) పరిధిలోకి రావాలన్న ప్రభుత్వ ప్రణాళికలో భాగంగానే పెన్షనర్ల బ్యాంకు ఖాతాలూ పిఎమ్‌జెడివై క్రిందకు వచ్చేలా ఉన్నాయి.

08/03/2016 - 00:53

ముంబయి, ఆగస్టు 2: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతకుముందు వరుసగా రెండు రోజులూ సూచీలు పతనమైనది తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం రాజ్యసభకు వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) రానుండటం, ఐరోపా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడం మదుపరులను లాభాల స్వీకరణ దిశగా నడిపించాయి.

Pages