-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
ముంబయి/న్యూఢిల్లీ, జూన్ 22: ఇప్పుడు ప్రపంచం చూపంతా.. ఆ వైపే. యూరోపియన్ యూనియన్ (ఈయు)లో బ్రిటన్ ఉంటుందా? ఉండదా? అన్న అంశంపైనే ప్రపంచ దేశాల ఆలోచనలన్నీ. దీనిపై బ్రిటన్లో గురువారం ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) జరుగుతుండగా, ఈయులో బ్రిటన్ సభ్యత్వంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
విశాఖపట్నం, జూన్ 22: విశాఖ జిల్లాలో వివిధ పరిశ్రమల శంకుస్థాపనకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. జూలై నాటికి అనుమతుల ప్రక్రియ పూర్తిచేసి శంకుస్థాపన చేసేందుకు వీలుగా కసరత్తు చేస్తున్నారు. స్పెషల్ ఎకనమిక్ జోన్లో దాదాపు 1,176 ఎకరాల స్థలాన్ని కేటాయింపులకు వీలుగా సిద్ధం చేశారు. పరిస్థితిని రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ బుధవారం విశాఖలో సమీక్షించారు.
న్యూఢిల్లీ, జూన్ 22: బ్రిటన్కు చెందిన బయో ఏజెన్సీని చేజిక్కించుకుంటున్నట్లు టెక్ మహీంద్ర తెలిపింది. నగదు ఆధారిత లావాదేవీల్లో భాగంగా బయో ఏజెన్సీ కోసం టెక్ మహీంద్ర 45 మిలియన్ పౌండ్ల వరకు వెచ్చిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) 12.5 మిలియన్ పౌండ్ల ఆదాయాన్ని బయో ఏజెన్సీ అందుకుంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) 7.3 మిలియన్ పౌండ్ల ఆదాయాన్ని పొందిన బయో ఏజెన్సీ..
ముంబయి, జూన్ 22: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. మంగళవారం సూచీలు నష్టపోయినది తెలిసిందే. గురువారం బ్రెగ్జిట్పై రెఫరెండం జరుగుతున్న క్రమంలో మదుపరులు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించారు.
బెంగళూరు, జూన్ 22: ప్రభుత్వరంగ బ్యాంకులకు ఆర్బిఐ మిగులు నగదు నిల్వలను అందించాలన్న ప్రతిపాదనను గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యతిరేకించారు. నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వరంగ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) వద్దనున్న మిగులు నగదును ఇవ్వాలంటూ వస్తున్న సూచనలను బుధవారం రాజన్ తోసిపుచ్చారు.
న్యూఢిల్లీ, జూన్ 21: ఆంధ్రప్రదేశ్ ప్లాంట్ సామర్థ్యాన్ని ఏషియన్ పెయింట్స్ పెంచుతోంది. దశలవారీగా ఈ ప్లాంట్ గరిష్ఠ వార్షిక సామర్థ్యాన్ని 5 లక్షల లీటర్లకు పెంచనున్నట్లు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కు ఏషియన్ పెయింట్ మంగళవారం తెలిపింది. పెట్టుబడులు కూడా స్వల్పంగా పెరుగుతాయని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 21: ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడేవారికి (విల్ఫుల్ టాక్స్ డిఫాల్టర్) అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఆదాయ పన్ను (ఐటి) శాఖ ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. అలాంటివారి శాశ్వత ఖాతా సంఖ్య (పర్మినెంట్ అకౌంట్ నెంబర్ లేదా పాన్)ను నిలిపివేయాలని, వంటగ్యాస్ రాయితీ (ఎల్పిజి సబ్సిడీ)ని రద్దు చేయాలని ఐటి శాఖ నిర్ణయించింది.
న్యూఢిల్లీ, జూన్ 21: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ నిష్క్రమణ నిర్ణయం.. దేశీయ స్టాక్ మార్కెట్లపై నిజంగా ప్రభావం చూపలేదా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. సోమవారం మార్కెట్లు లాభాల్లో ముగిసిన నేపథ్యంలో చిన్నచిన్న అంశాలకు ప్రభావితమయ్యే మదుపరులు.. రాజన్ నిష్క్రమణను తేలిగ్గా తీసుకున్నారనే అంతా అనుకున్నారు మరి.
అనంతపురం, జూన్ 21: అనంతపురం జిల్లా ఇండస్ట్రియల్ హబ్గా మారనుంది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా పరిశ్రమల కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. 2010- 15లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఐఐపిపిలో మార్పులు కూడా చేసింది. ఈ క్రమంలోనే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ (2015-20)ని తీసుకువచ్చింది. నూతన విధానాల్లో భాగంగా రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది.
ముంబయి, జూన్ 21: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 54.14 పాయింట్లు నష్టపోయి 26,812.78 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 18.60 పాయింట్లు కోల్పోయి 8,219.90 వద్ద నిలిచింది. ఐరోపా యూనియన్లో ఉండాలా? లేదా? అన్నదానిపై గురువారం బ్రిటన్లో ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతున్న క్రమంలో విదేశీ మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యారు.