S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

09/27/2016 - 02:45

భద్రాచలం, సెప్టెంబర్ 26: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ్‌పూర్, కొండగావ్ జిల్లాల్లో సోమవారం వేర్వేరుగా జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణ్‌పూర్ జిల్లా తోయ్‌నార్ అటవీ ప్రాంతంలో డిఆర్‌జీ బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడ్డారు. సుమారు గంటసేపు కాల్పులు జరిగాయి. సంఘటన ప్రదేశంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

09/27/2016 - 02:42

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26:వైద్య కళాశాల సీట్ల కౌనె్సలింగ్ నిర్వహణకు మరో నెల రోజులు గడువు ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా తెలంగాణకు గడువు పొడిగిస్తే ఏపీ వైద్య కళాశాలల సీట్ల కౌనె్సలింగ్‌కు సైతం గడువు పొడిగించాలంటూ ఏపీ ప్రైవేటు మెడికల్, దంత వైద్య కళాశాలల యాజమాన్య సంఘం, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.

09/27/2016 - 02:42

వాషింగ్టన్, సెప్టెంబర్ 26: సంగీతానికి దేశ, ప్రాంత, భాషాపరమైన ఎల్లలు లేవని లెజండరీ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా అన్నారు. అమెరికాలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఇళయరాజా సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘సంగీతానికి ఒక దేశమంటూ లేదు. దానికి సమయం లేదు. మరేమీ ఉండదు. సంగీతం - కేవలం సంగీతం మాత్రమే.’’ అని అన్నారు.

09/27/2016 - 02:39

హైదరాబాద్/ చార్మినార్, సెప్టెంబర్ 26: శేరిలింగంపల్లి మండలంలలోని రాయదుర్గం పాన్ మక్తాలోని ముంబై హైవేకు సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 83లోని 125.30 ఎకరల భూమికి సంబంధించిన వివాదంలో అరకు ఎంపి గీత భర్త నకిలీ పత్రాలతో భూమిని కాజేసేందుకు కుట్ర చేశారని, ఆ భూమిపై సర్వ హక్కులు భావన సహకార గృహ నిర్మాణ సొసైటీకే ఉన్నాయని సొసైటీ అధ్యక్షుడు పివిసి దాస్, ఉపాధ్యక్షుడు లక్ష్మిప్రసాద్, సభ్యులు జె.

09/27/2016 - 02:30

ముంబయి, సెప్టెంబర్ 26: ఒక పక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల బిగ్ డిబేట్, మరో పక్క ఈ వారంలో జరుగనున్న ఒపెక్ దేశాల సమావేశం వెరసి భారత స్టాక్ మార్కెట్లపై సోమవారం తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా గత రెండు వారాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రధాన స్టాక్ మార్కెట్ సెనె్సక్స్ 374 పాయింట్లు పడిపోయింది. అంతిమంగా 28,294.28 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 8,800 పాయింట్ల దిగువకు పతనమైంది.

09/27/2016 - 02:29

విజయవాడ, సెప్టెంబర్ 26: రాష్ట్రంలోని విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత అత్యున్నత వౌలిక సదుపాయాలు గల స్మార్ట్ సిటీలను తయారుచేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశలోనే ఆర్థికంగా అభివృద్ధికి దోహదపడే విమానాశ్రయాల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టింది.

09/27/2016 - 02:28

విశాఖపట్నం, సెప్టెంబర్ 26: హుదూద్ తుపాను కారణంగా దెబ్బతిన్న విశాఖలోని ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ఎప్పటికి జరిగేనో తెలియని స్థితి నెలకొంది. సవివర నివేదిక ఇచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా, ఆధునీకరణ దిశగా చర్యలు తీసుకోలేదు. విశాఖలో ఫిషింగ్ హార్బర్‌లో దాదాపు 700 మెకనైజ్డ్ బోట్లు చేపల వేట సాగిస్తున్నాయి. హుదూద్ తుపాను సమయంలో జెట్టీ, తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

09/27/2016 - 02:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర సెల్యులార్ ఆపరేటర్లకు, కొత్తగా మార్కెట్లోకి అడుగుపెడుతున్న రిలయన్స్ జియోకి మధ్య వివాదం ముదరడంతో టెలికామ్ నియంత్రణా సంస్థ ట్రాయ్ రంగంలోకి దిగింది. నిబంధనలకు విరుద్ధంగా కాల్‌డ్రాప్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో సంబంధిత టెలికామ్ ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ట్రాయ్ సోమవారం హెచ్చరించింది.

09/27/2016 - 02:23

హైదరాబాద్, సెప్టెంబర్ 26: కస్టమ్స్ అధీకృత ఆర్థిక నిర్వహణ భాగస్వామ్యం అంశంపై ఎప్ట్యాప్సీ ఈ నెల 27న సదస్సు నిర్వహించనున్నది.

09/27/2016 - 02:23

మచిలీపట్నం, సెప్టెంబర్ 26: కృష్ణా జిల్లాలో బందరు ఓడరేవు నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. దుబాయ్‌కు చెందిన ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ బందరులో మెరైన్ బిజినెస్ చేసేందుకు ముందుకొచ్చింది.

Pages