S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

06/17/2016 - 06:47

విశాఖపట్నం, జూన్ 16: నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడటం, కొత్త ప్రభుత్వ పాలన మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టినా పాలనా నిర్వహణలో ఇంకా స్పష్టత లేనేలేదు. కీలకమైన గిరిజన సహకార సంస్థ (జిసిసి), ఆంధ్రప్రదేశ్ పర్యాటక సంస్థ (ఏపీటిడిసి), ఏపీఆర్‌ఎస్‌ఆర్టీసీలు రాజధాని అమరావతికి తరలి వస్తాయా? లేదంటే స్మార్‌సిటీగా అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలోనే ఏర్పాటవుతాయా? అన్న సందిగ్ధం నెలకొంది.

06/17/2016 - 06:46

న్యూఢిల్లీ, జూన్ 16: బకాయిలను రాబట్టుకోవడానికి వచ్చే నెల వేలం వేసే సహారా గ్రూపు ఆస్తుల్లో సెబి మరో 16 ఆస్తులను చేర్చింది. వీటి రిజర్వ్ ధర రూ1245 కోట్లు. దీంతో మొత్తం రూ. 4345 కోట్ల విలువైన 42 ఆస్తులను సెబి వచ్చే నెల వేలం వేయనుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఆస్తులు కూడా వేలం వేయనున్నట్లు తెలుస్తోంది.

06/17/2016 - 06:46

న్యూఢిల్లీ, జూన్ 16: దేశంలో పప్పుదినుసుల ధరలు ఇప్పటికీ తారాస్థాయిలో కొనసాగుండటంతో మొబైల్ వ్యాన్ల ద్వారా కందిపప్పు, మినపపప్పును కిలో 120 రూపాయల చొప్పున అమ్మాలని కేంద్ర ప్రభుత్వం జాతీయ వినియోగదారుల సహకార సమాఖ్య (ఎన్‌సిసిఎఫ్)ను ఆదేశించింది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి హేమ్ పాండే అధ్యక్షతన జరిగిన అంతర్ మంత్రిత్వ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.

06/17/2016 - 06:39

ముంబై, జూన్ 16: సముద్రమార్గం నుంచి ఉగ్రవాద ప్రమాదం పెద్దఎత్తున పొంచి ఉన్నదని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. తీరప్రాంత భద్రతపై రాజ్‌నాథ్ గురువారం సమీక్షించారు. దేశంలోని భారీ, మధ్యతరహా ఓడరేవులు ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్నాయన్నారు. ‘1993లో రాయ్‌గఢ్‌లో భారీఎత్తున పేలుడు పదార్థాలు అక్రమంగా దేశంలోకి రవాణా అయ్యాయి.

06/17/2016 - 06:37

న్యూఢిల్లీ, జూన్ 16: ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం విడుదలకు మార్గం సుగమం అయింది. చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలంటూ అటు సుప్రీం కోర్టులోనూ ఇటు పంజాబ్, హర్యానా హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చారు. ఓ స్వచ్ఛంద సంస్థ, మానవ హక్కుల సంఘాలు బుధవారం ‘ఉడ్తా పంజాబ్’ విడుదలను ఆపాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేశాయి.

06/17/2016 - 06:37

న్యూఢిల్లీ, జూన్ 16: పప్పు్ధన్యాల ధరలు కిలో 200 రూపాయలకు చేరుకోవడంతో కిలో 120 రూపాయల చొప్పునే రిటైల్ మార్కెట్లో విక్రయించడానికి బఫర్ స్టాక్‌ను ముందు అనుకున్నదానికన్నా అయిదు రెట్లు అంటే 8 లక్షల టన్నులకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం గురువారం నిర్ణయించింది.

06/17/2016 - 06:34

న్యూఢిల్లీ, జూన్ 16: ఆరోగ్య బీమా పథకం పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులకు ఇక ప్రతి ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్‌ఐసి) ప్రకటించింది. 40 ఏళ్ల వయసు పైబడిన ఉద్యోగులకు ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నారు.

06/17/2016 - 06:30

న్యూఢిల్లీ, జూన్ 16: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సిక్కు అల్లర్ల భూతం కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌ను ఇప్పటికీ వెలండాడుతూనే ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న పంజాబ్‌కు కాంగ్రెస్ అధిష్ఠానం కమల్‌నాథ్‌ను పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా నియమించినప్పటికీ ఆయన రాజకీయ ప్రత్యర్థుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోక తప్పలేదు. ఒక దశలో ఆయనపై కేసు పెట్టడానికి కూడా వారు సిద్ధమయ్యారు.

06/17/2016 - 06:28

న్యూఢిల్లీ, జూన్ 16: ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదిహేనేళ్లపాటు ఏకబిగిన పనిచేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్‌కు కాంగ్రెస్ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించనుందా? ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆమెను బరిలోకి దింపనుందా? వీటికి సంబంధించి గురువారం ఊహాగానాలు ఊపందుకున్నాయి.

06/17/2016 - 06:26

బీజింగ్, జూన్ 16: అణు ఇంధన సరఫరా దేశాల గ్రూప్ (ఎన్‌ఎస్‌జి)లో సభ్యత్వం సాధించే దిశగా భారత్ దూసుకుపోతోందని చైనా అధికార మీడియా అక్కడి ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఎన్‌ఎస్‌జిలోకి భారత్ చేర్చుకోవటం వల్ల దక్షిణాసియాలో వ్యూహాత్మక సంతులనం దెబ్బతినే ప్రమాదం ఉందని అక్కడి మీడియా పేర్కొంది.

Pages