-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
తాండూరు, : వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకుని కన్న కూతురిని హత్య చేశాడు. ఎంతో ప్రేమగా పెంచుకున్న ఐదేళ్ల చిన్నారిని తండ్రి దూరం చేయడంతో ఆ కన్నతల్లి కన్నీరు మున్నీరైంది. సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు రూరల్ గ్రామం పోలీస్ స్టేషన్ పరిధిలోని కరన్కోట్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. తాండూరు మండలం అల్లాపూర్లో గురువారం రాత్రి ఘటన జరిగింది.
ఘట్కేసర్, మే 24: జల్సాలకు అలవాటు పడి గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని అమ్మటంతో పాటు ఏకంగా ఇంట్లో గంజాయి చెట్లను పెంచుతున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
న్యూఢిల్లీ, మే 24: శారదా చిట్ ఫండ్ భారీ కుంభకోణం కేసులో తనను సీబీఐ పోలీసులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాల్సిందిగా కోల్కత్తా మాజీ పోలీసు కమిషనర్ రాజీవ్ కుమార్ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది.
న్యూఢిల్లీ, మే 24: సుప్రీం కోర్టుకు నియమితులైన నలుగురు న్యాయమూర్తులు శుక్రవారం చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. వీరి రాకతో దేశ అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిల సంఖ్య 31కి చేరింది. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులున్నారు. ఈక్రమంలో సుప్రీం కోర్టుకు పూర్తి స్థాయి న్యాయమూర్తుల నియామకం పూర్తయింది.
వర్ధన్నపేట, మే 24: కట్టుకున్న భర్త కాలయముడై తన భార్యను పదునైన వస్తువుతో అతి కిరాతకంగా గొంతుకోసి చంపిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. వర్ధన్నపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్రియాల గ్రామంలో చెవ్వల యాదగిరి అనే వ్యక్తి 25 సంవత్సరాల క్రితం రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మల్లికాంబతో వివాహం జరిగింది.
ఆదిలాబాద్,మే 24: ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి విపత్తుకు ముగ్గురు యువకుల ప్రాణాలు గాలిలో కలిశాయి. రెండు వేర్వేరు సంఘటనల్లో పిడుగులు ముగ్గురిని బలితీసుకున్నాయ. మంచిర్యాల జిల్లా బీమారం మండలం పోలంపల్లి వరి కేంద్రం వద్ద శుక్రవారం ఉదయం ఉరుములు మెరుపులతో పిడుగు పడిన ఘటనలో పంటక్షేత్రంలో పనిచేస్తున్న యువకుడు రాజేందర్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు.
సూరత్, మే 24: సూరత్లో శుక్రవారం ఓ నాలుగు అంతస్థుల వాణిజ్య భవంతిలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంలో 18 మంది విద్యార్థులు దుర్మరణం చెందారు. వీరంతా కూడా ఈ భవనంలో ఉన్న ఓ కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్నవారే. ప్రమాదవశాత్తు మంటలు వ్యాపించడంతో చాలా మంది విద్యార్థులు భవనం నుంచి దూకి మరణించారు. మరి కొందరు ఊపిరాడని పరిస్థితుల్లో మృతి చెందారని అధికారులు తెలిపారు.
ఢిల్లీ, మే 24: మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా ముందస్తుబెయిల్ రద్దుచేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణకు సహకరించకపోవడం, సాక్ష్యాలను తారుమారు చేయడం వంటి కారణకాలతో ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. ఏప్రిల్ 1న ట్రయల్ కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దుచేయాలని ఈడీ తరఫున్యాయవాది డీపీ సింగ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
శ్రీనగర్, మే 24: కాశ్మీర్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో అల్ఖైదా అనుబంధ సంస్థ అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ చీఫ్ జాకీర్ ముసాను భద్రతా దళాలు హతమార్చాయి. దక్షిణ కాశ్మీర్లోని పుల్వామా జిల్లా ట్రల్లో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకొంది. పారిపోతున్న ఓ ఉగ్రవాదిపై కాల్పులు జరపగా ముసా హతమైనట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి రాజేష్ కాలియా వెల్లడించారు.
గుర్రంపోడు, మే 22: నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం ఎస్ఐ డి.క్రాంతికుమార్ భూతగాదాల నేపధ్యంలో బాధిత రైతు నుండి హోంగార్డు ద్వారా 40వేలు లంచం తీసుకుని ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్కుమార్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని ఉట్లపల్లి గ్రామానికి చెందిన రైతు తుమ్మలూరు వెంకట్రెడ్డి తాను కొనుగోలు చేసిన భూమి కి సంబంధించి నెలకొన్న వివాదంపై పోలీసులను ఆశ్రయించాడు.