S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

05/25/2019 - 22:57

మహబూబ్‌నగర్‌టౌన్, మే 25: సమాజంలోని సామాన్యుడికి న్యాయవ్యవస్థపై నమ్మకం కలిగించేలా పనిచేయాలని న్యాయం కోసం వచ్చేవారికి న్యాయం అందించాలన్న లక్ష్యంతో మనమంతా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర ఎస్.చౌహాన్ అభిప్రాయపడ్డారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన జిల్లా కోర్టుకు విచ్చేశారు.

05/25/2019 - 22:56

భువనగిరి, మే 25: పక్కా గృహాలు నిర్మించి ఇస్తామని నామమాత్రంగా 30వేలు చెల్లించి ఇంటిని సొంతం చేసుకోవచ్చని నమ్మించి 8కోట్ల రూపాయలు వసూలుచేసిన మాల్యావికరుణ సొసైటీ సభ్యులను అరెస్టుచేసినట్లుగా భువనగిరి డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.

05/25/2019 - 22:56

పరకాల, మే 25: పరకాల మాజీ ఎమ్మెల్యే బండారి శారారాణి అనారోగ్యంతో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని తన నివాసంలో మృతి చెందారు. 2004లో పరకాల నుండి ఎమ్మెల్యేగా తెరాస నుండి పోటీ చేసి గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే శారారాణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే శారారాణి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

05/25/2019 - 22:56

భువనగిరి, మే 25: నేరాలను అరికట్టేందుకే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలుపగా ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే శామీర్‌పేట వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేపడతామని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ వెల్లడించారు.

05/25/2019 - 22:38

రాజమహేంద్రవరం, మే 25: తాజా ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై కోడి కత్తితో దాడి చేసిన జె శ్రీనివాసరావు శనివారం బెయిల్‌పై రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలు నుంచి విడుదలయ్యాడు. ఏడు నెలల క్రితం పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళుతున్న జగన్‌పై విశాఖపట్నం విమానాశ్రయంలో శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే.

05/25/2019 - 22:38

పత్తికొండ, మే 25: ఎండ తీవ్రతకు కారు తగులబడింది. అందులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన శనివారం కర్నూలు జిల్లా పత్తికొండలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన ఫొటోగ్రాఫర్ సురేష్, తన మిత్రులతో కలిసి మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామిని దర్శించుకుని తిరిగి కారులో బెంగళూరుకు బయల్దేరారు.

05/25/2019 - 22:37

విశాఖపట్నం, మే 25: విశాఖలో సంచలనం రేకెత్తించిన కిడ్నీ రాకెట్ కేంద్రం శ్రద్ధ ఆసుపత్రిని అధికారులు శనివారం సీజ్ చేశారు. కిడ్నీ మార్పిడికి సంబంధించి ఇటీవల వెలుగు చూసిన కొన్ని సంఘటనలపై నమోదైన కేసుతో ఆసుపత్రిలో చోటుచేసుకున్న అవకతవకలపై యంత్రాంగం ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది.

05/25/2019 - 22:36

గుంటూరు, మే 25 : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత గుంటూరు జిల్లా పల్నాడులో ఆధిపత్యపోరు మరోసారి భగ్గుమంది. ముఖ్యంగా గురజాల నియోజకవర్గ పరిధిలో టీడీపీ ఓడిపోవడంతో గ్రామాల్లోని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను వైసీపీ నాయకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. దుర్గి మండలం జంగమహేశ్వరపాడు గ్రామంలో పోలింగ్ సమయంలో రేగిన వివాదం ఘర్షణకు దారితీసింది.

05/25/2019 - 22:19

సనా, మే 25: యెమెన్ మూడో నగరమైన తైజ్‌లో గత రాత్రి జరిగిన వైమానిక దాడుల్లో 9 మంది పౌరులు మృతి చెందినట్లు ఓ వైద్యుడు, స్వతంత్ర తిరుగుబాటు దారుడు శనివారం తెలిపారు. సౌదీ నేతృత్వంలోని సైనిక సంకీర్ణ బలగాలు జరిగిన ఈ దాడుల్లో ఇద్దరు చిన్నారులు కూడా మృతి చెందారని పేర్కొన్నారు. వీరితో పాటు అనేకమంది గాయ పడ్డారన్నారు.

05/25/2019 - 22:18

ముంబయ, మే 25: మహారాష్టల్రోని అకోలా జిల్లాకు చెందిన బీజేపీ మైనారిటీ సెల్ కార్యకర్త మతిన్ పటేల్ (48) దారుణ హత్యకు గురైనట్లు శనివారం పోలీసులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం మొహాల్ల గ్రామంలో, అకోలా జిల్లాకు 508 కిలో మీటర్ల దూరంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మతిన్‌కు తన కమ్యూనిటీకి చెందిన కొంతమందితో వివాదం జరిగింది.

Pages