S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/20/2019 - 02:18

ఉప్పల్, మార్చి 19: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలను అధికారులు ముమ్మరం చేశారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో 24గంటలు పని చేసేందుకు మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం పని చేస్తుందని. 8 గంటల చొప్పున స్క్వాడ్ మూడు విడతలుగా పని చేస్తున్న క్రమంలో మంగళవారం సాయంత్రం మల్లాపూర్ మాణిక్‌చెంద్ చెక్ పోస్టు వద్ద వేహికిల్ చెకింగ్‌లో రూ.10లక్షల నగదు పట్టుబడ్డాయి.

03/20/2019 - 00:16

గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. నిలిచిఉన్న లారీని అంబులెన్స్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు గుంటూరు జిల్లా నరసారావుపేట ఎస్‌ఆర్ గేట్ కాలనీకి చెందిన షేక్ మస్తాన్‌వలీ, షేక్ బాజీ, గౌస్ ఇస్మాయిల్, మణికంఠగా గుర్తించారు. యంత్రాల మరమ్మతుకోసం రైలులో డోన్ చేరుకున్నారు.

03/20/2019 - 00:15

హైదరాబాద్, మార్చి 19: లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగంధం చిత్రాలు విడుదలను నిలిపివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఈ సినిమాలు విడుదల అయితే ఆంధ్రలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ చిత్రాలపై స్టే ఇవ్వాలని హైదరాబాద్‌కు చెందిన సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు.

03/19/2019 - 04:31

తిరుపతి, మార్చి 18: తిరుమలలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న మూడు నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన మహిళను 24 గంటల్లో పోలీసులు అరెస్టు చేశారు. మంగళం క్వార్టర్స్‌లో ఉన్న ఆమెను సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించిన పోలీసులు సోమవారం అరెస్టు చేసి ఆమె వద్ద నుంచి బిడ్డను స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు.

03/19/2019 - 03:41

గూడూరు, మార్చి 18: సీపీఐ (ఎంఎల్) న్యూడెమాక్రసీ రాయల వర్గం మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యుడు గూడూరు డివిజన్ కార్యదర్శి అజాత దళ కమాండర్ పెనుక వెంకన్న, అలియాస్ విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి తపంచా, 10 తూటాలు విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు.

03/19/2019 - 02:06

పులివెందుల, మార్చి 18: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం మాజీ ఎంపీ వైఎస్.అవినాష్‌రెడ్డిని పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ సభ్యులు డీఎస్పీ శ్రీనివాసులు విచారించారు.

03/19/2019 - 02:04

న్యూఢిల్లీ, మార్చి 18: పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల మేర ముంచేసి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై లండన్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆయనను త్వరలోనే అదుపులోకి తీసుకుని భారత్‌కు అప్పగించే ప్రక్రియను చేపడతామని అధికారవర్గాలు తెలిపాయి.

03/19/2019 - 01:26

జీడిమెట్ల, మార్చి 18: కుటుంబ కలహాలతో ఓ గృహిణి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కొంపల్లిలో నివాసముండే కే.గీత (20), భర్త శ్రీకాంత్. భార్యాభర్తల మధ్య కలహాలతో గీత ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలను ఆర్పివేసి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

03/19/2019 - 01:25

ఉప్పల్, మార్చి 18: అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బోడుప్పల్ అన్నపూర్ణకాలనీలో నివసిస్తున్న కంబాల సీతారామయ్య భార్య భారతి (35) ఇద్దరు పిల్లలు. అయినప్పటికీ కుటుంబ సంసారం విషయంలో తరుచూ గొడవలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యాభర్తలు గొడవ పడ్డారు.

03/19/2019 - 02:33

న్యూఢిల్లీ: యాసిడ్ దాడి అనేది అనాగరిక చర్య, క్రూరమైన నేరమని, అలాంటి దారుణానికి పాల్పడిన వ్యక్తులపై ఎలాంటి జాలి, దయాగుణం చూపాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.

Pages