S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

03/18/2019 - 04:42

పులివెందుల, మార్చి 17: మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య సంఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ అధికారి మహంతి ఆధ్వర్యంలో పలు బృందాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి.

03/18/2019 - 04:38

తిరుపతి, మార్చి 17: తిరుమలలో మూడు నెలల బాలుడు ఆదివారం తెల్లవారుజామున కిడ్నాప్‌కు గురయ్యాడు. తల్లిదండ్రుల వద్ద నిద్రిస్తున్న బాలుడిని ఓ గుర్తుతెలియని మహిళ తీసుకెళుతున్న దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయ్యాయి. ఆమెను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కాగా గత నాలుగేళ్లలో ముగ్గురు చిన్నారులు కిడ్నాప్‌కు గురవడం గమనార్హం.

03/18/2019 - 04:19

మేళ్లచెర్వు, మార్చి 17: తనకున్న పొలంతో పాటు కౌలుకు తీసుకున్న పొలా నికి పెట్టుబడి పెట్టి వచ్చిన పంటను విక్రయించినా అప్పులు వెంటాడంతో కౌ లు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వులో విషాదం నింపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మేళ్లచెర్వుకు చెందిన పసుపులేటి కనకారావు (44) తనకున్న 3 ఎకరాలతో పాటు, మరో తొమ్మి ది ఎకరాలను కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి సాగు చేశాడు.

03/18/2019 - 04:17

మహబూబ్‌నగర్, మార్చి 17: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కర్వెన రిజర్వాయర్‌కు తవ్వుతున్న క్వారీలోని ఊట బావిలో పడి ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వెన ప్రాంతంలో చోటు చేసుకుంది.

03/18/2019 - 01:14

వనస్థలిపురం, మార్చి 17: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాగర్ రహదారిపై సంఘటన చోటు చేసుకుంది. బంధువుల ఇంట్లో ఫంక్షన్ కోసం వెళ్తూ రోడ్డు ప్రక్కనే ఉన్న హోటల్ వద్ద ముగ్గురు యువకులు మాట్లాడుకుంటుండగా వేగంగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. ముగ్గురూ దగ్గరి బంధువులు కావడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

03/18/2019 - 01:13

శంషాబాద్, మార్చి 17: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న రెండు కిలోల బంగారాన్ని ఆదివారం తెల్లవారుఝామున ఇమిగ్రేషన్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన వ్యక్తి కారు ఇంజన్ విడి భాగాల్లో పెట్టుకుని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేసి అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి బంగారంతో పాటు అతని అదుపులోకి తీసుకున్నారు.

03/18/2019 - 01:13

వనస్థలిపురం, మార్చి 17: టెంట్ హౌజ్ గోదాంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.30 లక్షల విలువ గల ఆస్తినష్టం సంభవించిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సాగర్ కాంప్లెక్స్‌లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సాగర్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న రాముకు కాలనీలో టెంట్ హౌజ్‌కు సంబంధించిన గోదాం ఉంది.

03/17/2019 - 05:06

అనంతపురం, మార్చి 16: ఇంటి నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ గుంతల్లో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఈ సంఘటన అనంతపురం నగరంలోని హమాలీకాలనీలో శనివారం జరిగింది. కాలనీకి చెందిన ముగ్గురు పిల్లలు రియాన్(3), ఆయాన్(6), రుద్రప్రసాద్(5) నీటి గుంతల్లో పడి మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. హమాలీకాలనీలో ఇంటి నిర్మాణం కోసం పిల్లర్ గుంతలు తవ్వారు. ఆ గుంతల్లో నీరు చేరింది.

03/17/2019 - 05:18

కొమరోలు: సంపాదనకు మించి అప్పులు చేయడం, వాటి భారం రోజురోజుకు పెరిగిపోతుండటంతో తీర్చే దారిలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లినగరం గ్రామంలో ఈ విషాద సంఘటన శనివారం వేకువజామున చోటు చేసుకుంది. ఈ ఘటనలో జక్కా రాఘవేంద్ర నాగరాజు (42), భార్య ఈశ్వరిదేవి (38), పెద్దకుమార్తె వైష్ణవి (15), చిన్నకుమార్తె వరలక్ష్మి (12) పురుగుల మందు తాగి తనువు చాలించారు. వివరాల్లోకి వెళితే..

03/17/2019 - 04:44

విశాఖపట్నం, మార్చి 16: నేవల్ డాక్‌యార్డు మిలటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్) ఆధ్వర్యంలో సివిల్ వర్క్‌కు సంబంధించి టెండర్ ఆమోదానికి కాంట్రాక్టర్‌ను లంచం డిమాండ్ చేసినట్టు అందిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఏసీబీ విభాగం ముగ్గురిపై కేసు నమోదు చేసింది. సివిల్ వర్క్‌కు సంబంధించి రూ.3.5 లక్షలు డిమాండ్ చేయడంతో కాంట్రాక్టర్ సీబీఐని ఆశ్రయించాడు.

Pages