-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
న్యూఢిల్లీ, జనవరి 7: కాంగ్రెస్ నేత సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా మరో చిక్కుల్లో పడ్డాడు. హర్యానాలోని గూర్గావ్లో భూమి వ్యవహారాల్లో అతనికి సంబంధించిన సంస్థలో ఆర్థిక, ఇతర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాద్రాపై ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసును నమోదు చేసింది.
న్యూఢిల్లీ, జనవరి 7: తాము ఎప్పుడో రద్దు చేసిన ఐటీ యాక్టులోని 66ఎ చట్టాన్ని ప్రయోగించి ఇంకా ప్రజలకు శిక్షలు విధించడం పట్ల సుప్రీం కోర్టు సోమవారం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తాము 2015లోనే రద్దు చేసిన ఈ చట్టాన్ని ప్రయోగిస్తూ తమ ఆజ్ఞలు ఉల్లంఘిస్తున్న అధికారులను ఎందుకు జైలుకు పంపరాదో తెలియజేయాలని పేర్కొంటూ, దీనిపై తమ వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది.
ఉప్పల్, జనవరి 7: రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెదిరించిన నకిలీ పోలీసును మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి సోమవారం కోర్టుకు రిమాండ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... కూకుట్పల్లి మూసాపేట్లో నివసిస్తున్న బానోతు ప్రవీణ్ కుమార్ (24) ఓ ఛానల్లో క్రైం రిపోర్టర్గా పని చేస్తున్నాడు. గత నెల 29న బోడుప్పల్ నివాసి రవీందర్ రెడ్డి బంధువులతో యువతితో కారులో వెళ్తుండగా వీడియో తీసి బెదిరించాడు.
మెహిదీపట్నం, జనవరి 7: రెండవ అంతస్తులో సెంట్రింగ్ పనులు చేస్తున్న కూలీ ప్రమాదవశాత్తు ఇనుపరాడ్ హైటెన్షన్ వైర్లకు తగిలి కిందపడి దుర్మణం చెందిన సంఘటన ఆసీఫ్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీనయ్య కథనం ప్రకారం.. ఆసీఫ్నగర్కు చెందిన దారా సింగోటా కుమారుడు దారా బాబు (49) సెంట్రింగ్ పనులు చేసుకుంటాడు.
జీడిమెట్ల, జనవరి 7: ఇద్దరు కూలీల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. సుత్తితో కూలీపై దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందిన సంఘటన బాచుపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే... వనపర్తి, పెబ్బేరు గ్రామానికి చెందిన గుడిసె కుర్మయ్య (38) మియాపూర్, హఫీజ్పేట్, ప్రేమ్నగర్లో నివాసముంటున్నాడు. కూలి పని చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు.
డి గన్నవరం, జనవరి 7: బావమరిదిని హత్యచేసిన బావకు జీవిత ఖైదును విధిస్తూ అమలాపురం అదనపు జిల్లాకోర్టు జడ్జి డి సత్యవెంటక హిమబిందు సోమవారం తీర్పును వెల్లడించారు. దీనికి సంబంధించి పి గన్నవరం ఎఎస్సై కెఎస్వియస్ ప్రసాద్ తెలిపిన వివారలు ఇలా ఉన్నాయి.
మహానంది, జనవరి 7: మండలంలో వన్యప్రాణులను వేటాడుతున్నాడన్న అనుమానంతో ఓ బాలుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచారు. సోమవారం చలమ రేంజ్ ఆఫీసర్ గౌడు, డీఆర్ఓ ముర్తుజావలి, ఎఫ్ఎస్ఓ శ్రీనివాసరెడ్డి, ఎఫ్బీఓ రామకృష్ణలు ఈ బాలున్ని విచారణ చేసి అరెస్టు చేసి కర్నూలులోని కోర్టుకు హాజరుపరచినట్లు అధికారులు తెలిపారు. ఈకేసులోనే మరో ఇద్దరు సూరి, అశోక్ అనే యువకులు తప్పించుకున్నట్లు వారు తెలిపారు.
బేతంచెర్ల, జనవరి 7:పట్టణంలోని బైటిపేటకు చెందిన బీ.టెక్ విద్యార్థి మంచాల సాయిజశ్వంత్(21) కడుపునొప్పి భరించలేక సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఏఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. వివరాలు.. బైటిపేటకు చెందిన మంచాల రామక్రిష్ణ, నీలవేణీ దంపతుల ఏకైక కుమారుడు సాయి జశ్వంత్ నరసరావుపేటలో బీ.టెక్ ద్వితీయ సంవత్సరం చదువుచున్నాడు. అతడు చాలాకాలంగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు.
గూడెంకొత్తవీధి, జనవరి 7 : విశాఖ ఏజన్సీ గూడెంకొత్తవీధి మండలం కుంకుంపూడి ఘాట్ రోడ్డులో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వారపు సంతకు వచ్చిన ప్రయాణీకులను తీసుకువెళ్తున్న జీపు కుంకుంపూడి ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈప్రమాదంలో ఒక గిరిజనుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరణించిన సుకూరు బుజ్జిబాబు(35) చిన్న అగ్రహారం గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.
కొత్తూరు, జనవరి 7: అదనపు కట్నం తీసుకురావాలని తన భర్త, అత్తమామలు వేధిస్తున్నారని నివగాం గ్రామానికి చెందిన గోన బోయిన కళ్యాణి సోమవారం కొత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ ఐ తెలిపిన వివరాలు ప్రకారం కళ్యాణికి కాకినాడకు చెందిన వీరవెంకటరమణారావుకు 2015లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు.