-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
ఖమ్మం రూరల్, జనవరి 10: స్థానిక బైపాస్రోడ్లోని కరుణగిరి టిఎన్జివోస్ కాలనీ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామన్నపేటకు చెందిన ఇద్దరు సుతారి కూలీలు దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. రామన్నపేటకు చెందిన యాకూబ్ (26), చంద్రగాని శ్రీకాంత్ (25)లు మండలంలోని సాయి గణేష్నగర్లో సుతారి పనిచేసేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.
బైరెడ్డిపల్లి, జనవరి 10: మండలంలోని తీర్థం గ్రామానికి చెందిన నలుగురు దుప్పి మాంసం పంచుకుంటున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పలమనేరు అటవీశాఖ రేంజర్ మదన్మోహన్రెడ్డి గురువారం తెలిపారు. బుధవారం తీర్థం సమీపంలో వ్యవసాయ పొలాల వద్ద అదే గ్రామానికి చెందిన జయరాం, శ్రీనివాసులు, చిన్న, నాగరాజులు దుప్పి మాంసం పంచుకుంటుండగా అటవీ సిబ్బంది దాడి చేశారు.
గుంటూరు (అరండల్పేట), జనవరి 10: గుంటూరు నగరంలో మోటారు వాహనాల చోరీకి పాల్పడుతున్న వ్యక్తిని కటకటాల వెనక్కి పంపారు నల్లపాడు పోలీసులు. గురువారం నల్లపాడు పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో నల్లపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలమురళీకృష్ణ నిందితుడి వివరాలను వెల్లడించారు.
వరంగల్, జనవరి 9: కోకాకోలా లాటరీ వచ్చిందంటూ యువకులకు టోకరా వేస్తున్న నైజీరియన్ సైబర్ మోసగాడు ఎట్టకేలకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఇతనితో పాటు నాగాలాండ్కు చెందిన ఓ యువతిని కూడా బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ పోలీసుల సహకారంతో శాయంపేట పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు.
ధవళేశ్వరం, జనవరి 9: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరం గ్రామంలో బుధవారం కంటైనర్ లారీ స్కూటర్ను ఢీకొన్న ప్రమాదంలో యువతీ యువకులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం ప్రకారం కడియం మండలం పొట్టిలంక గ్రామానికి చెందిన ఆనం స్వరూప (17) రాజమహేంద్రవరంలోని ఒక ప్రైవేటు కళాశాలలో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది.
విశాఖపట్నం(క్రైం), జనవరి 9: రైలులో బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని డీఆర్ఐ అధికారులు పట్టుకుని, రూ.కోటి ఏనిమిదిన్నర లక్షల రూపాయల విలువ చేసే 3.3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు విడుదల చేశారు.
సోమందేపల్లి, జనవరి 9: ఆర్టీసీ బస్సు కోసం రోడ్డువారగా నిలుచున్న ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లిన సంఘటనలో నవవధువుతో పాటు మరొకరు మృతి చెందారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి సమీపంలో బుధవారం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి నిలుచున్న వారిపైకి దూసుకెళ్లడంతో గ్రామానికి నరసమ్మ(53), ఆమె కూతురు భారతి(29) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
పూతలపట్టు, జనవరి 9: చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపలపల్లి గ్రామం వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందగా, ఎస్సైతో పాటు మరో ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. విధి నిర్వహణలో భాగంగా జన్మభూమి కార్యక్రమానికి హైవే పెట్రోలింగ్ వాహనంలో వెళుతుండగా స్కూటర్ను తప్పించబోయి వీరి వాహనం అదుపుతప్పి చింతచెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకొంది.
హైదరాబాద్, జనవరి 9: జంటనగరాల్లో గొలుసు దొంగతనాలకు పాల్పడుతూ మహిళలను భయకంపితులను చేస్తున్న గొలుసు దొంగలను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణకు వలస వచ్చిన ఉత్తర ప్రదేశ్కు చెందిన వాల్మీకి అలియాస్ రాహుల్, ప్రణీత్ చౌదరి అలియాస్ మాన్యలు రహదార్లపై వెళుతున్న మహిళలను టార్గెట్ చేస్తూ బైకులపై దర్జాగా వెళ్లూ మహిళలను దోచుకునేవారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫొటోలను పోలీసులు గుర్తించారు.
పరిగి, జనవరి 9: ట్రాక్టర్ - బైక్ ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ఎస్ఐ అరుణ్ కుమార్ తెలిపిన వివరాలు కొడంగల్ మండలం ఉస్సేన్పూర్ గ్రామానికి చెందిన మూర్తి కాశప్ప(25), ఎల్లప్ప(30) మొయినాబాద్లో రోజువారీ కూలీలుగా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి ఉస్సేన్పూరు నుంచి ఇద్దరు మొయినాబాద్కు బైక్పై బయలుదేరారు.