S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రైమ్/లీగల్

12/06/2018 - 23:30

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: రహదారులపై గుంతల వల్ల ప్రమాదాలు జరిగి ఎందరో చనిపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టులేదని సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ సరిహద్దులో కాల్పుల్లో చనిపోతున్నవారికంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదని బెంచ్ హెచ్చరించింది.

12/06/2018 - 22:45

చీరాలటౌన్, డిసెంబర్ 6: సముద్రస్నానానికి వెళ్లి అలల తాకిడికి కొట్టుకొని పోయి వ్యక్తి మృతిచెందిన సంఘటన వాడరేవులో గురువారం చోటుచేసుకుంది. ఈపూరుపాలెం ఎస్సై అనూక్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చీరాల మండలంలోని తోటవారిపాలెం పంచాయతీ భావనారుషి పేటకు చెందిన పల్లెపు వీరేంద్రనాథ్ (35) కుటుంబసభ్యులతో కలిసి వాడరేవు సముద్ర స్నానానికి వెళ్లాడు.

12/06/2018 - 22:45

యర్రగొండపాలెం, డిసెంబర్ 6: పంటల కోసం చేసిన అప్పులు తీర్చలేక ఓ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మండలంలోని గుర్రపుసాల గ్రామంలో జరిగింది. వివరాల మేరకు గ్రామానికి చెందిన గాగర్లమూడి యోగేశ్వరరావు (32) తనకు ఉన్న ఐదు ఎకరాల భూమిలో రెండు ఎకరాలు బత్తాయి, రెండు ఎకరాలు మిరప, ఒక ఎకరాలో బొప్పాయి సాగు చేశాడు. నీరు లేకపోవడంతో పంటలు ఎండిపోయి అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

12/06/2018 - 04:25

వరంగల్, డిసెంబర్ 5: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట సిద్ధార్ధనగర్‌లో బుధవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు భారీగా నోట్లకట్టలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కాజీపేట ఫ్లైఓవర్ బ్రిడ్జీవద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అందులో రెండున్నర లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో దాదాపు మూడు కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

12/06/2018 - 04:21

కరీంనగర్ రూరల్, డిసెంబర్ 5: కొత్తపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని రేకుర్తి విజయపురి కాలనీకి చెందిన బోయిని అంజయ్య (38) అనే వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని రెండు రోజుల క్రితం మృతి చెందినట్లు కొత్తపల్లి ఎస్సై స్వరూప్‌రాజ్ బుధవారం తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మనసికంగా ఇబ్బంది పడేవాడని తెలిపారు.

12/06/2018 - 04:17

జిన్నారం(గుమ్మడిదల),డిసెంబర్ 5: కన్న కొడుకుకి అనారోగ్యం వుండే వైద్యం చేయించి కాపాడుకోవాల్సిన తండ్రి కుమారుడి పట్ల కాలయముడిగా మారాడు. ఈ హృదయ విధారక సంఘటన గుమ్మడిదల మండలంలోని మంబాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది.

12/06/2018 - 03:25

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: అగస్టావెస్ట్‌లాండ్ వీవీఐపీ హెలీకాప్టర్ కొనుగోలులో మధ్యవర్తిగా వ్యవహరించిన క్రిస్టియన్ మైఖేల్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదు రోజుల కస్టడీ విధించింది. దుబాయి నుంచి మైఖేల్‌ను మంగళవారం రాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు. బుధవారం ఆయనను సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. క్రిస్టియన్ మైఖేల్‌కు బెయిల్ కోసం పాటియాలా కోర్టులో ఆయన న్యాయవాది పిటిషన్ వేశారు.

12/06/2018 - 01:46

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిని ముందస్తుగా ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్‌రెడ్డిని ఉమ్మడి హైకోర్టు నిలదీసింది. బుధవారం న్యాయమూర్తులు రాఘవేంద్ర ఎస్ చౌహాన్, ఎం సత్యనారాయణ మూర్తితో కూడిన హైకోర్టు ధర్మాసనం రేవంత్ కేసును విచారించింది. ఈకేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు.

12/06/2018 - 01:18

కొండమల్లేపల్లి, డిసెంబర్ 5: నాగార్జునసాగర్ - హైద్రాబాద్ రహదారిపై నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం కేశ్యతండా వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోగు సురేందర్‌రెడ్డి (60), పోగు యాదమ్మ (50) అనే భార్యా భర్తలతో పాటు వారి అల్లుడు తిప్పని వెంకట్‌రెడ్డి (35) మృతిచెందగా మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

12/06/2018 - 03:27

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో బుధవారం కీలక మలుపు చోటుచేసుకుంది. జగన్మోహన్ రెడ్డి హత్యాయత్నంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కేంద్ర ప్రభుత్వనికి అందలేదని కేంద్ర సోలిసిటర్ జనరల్ కె.లక్ష్మణ్ ఉమ్మడి హైకోర్టుకు పంపిన వౌలిక ఆదేశాల్లో స్పష్టం చేశారు.

Pages