-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
బంగారుపాళ్యం, డిసెంబర్ 9: ఓ బస్సులో 15 కిలోల బంగారు నగలు అహరణకు గురైన సంఘటన చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో ఆలస్యంగా ఆదివారం వెలుగుచూసింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముంబైకి చెందిన సంజయ్, కేదార్ తయారుచేసిన నగలను దేశవ్యాప్తంగా పలు బంగారు దుకాణాలకు సరఫరా చేస్తుంటారు.
చింతూరు, డిసెంబర్ 9: ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులు తూర్పు గోదావరి జిల్లా చింతూరు డీఎస్పీ దిలీప్ కిరణ్ ఎదుట ఆదివారం లొంగిపోయారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం..దెయ్యాలవాయి గ్రామానికి చెందిన కొవ్వాసి చోకే, జిల్లేడుగుంపు గ్రామానికి చెందిన మడకం లచ్చు, మడకం సింగయ్యలు మావోయిస్టులకు సహాయ సహకారాలు అందించేవారు. 2016లో ఈ ముగ్గురు మావోయిస్టు శబరి ఏరియా కమిటీలో చేరారు.
గూడూరు, డిసెంబర్ 9: గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ఫ్రైడ్రైస్ దుకాణంలోకి ఆదివారం కారు అదుపుతప్పి దూసుకుపోయిన సంఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఫ్రైడ్రైస్ షాపులో గ్యాస్ పొయ్యిమీద బాణిలిలో నూనె కాగుతున్న సమయంలో కారు దూసుకెళ్లడంతో వేడినూనె పడి పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఒక వ్యక్తికి కాలు విరిగింది.
చీరాల, డిసెంబర్ 9 : రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన కారంచేడు మండలంల పోతినవారిపాలెం గ్రామం వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ఆదివారం సాయంత్రం వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన పిక్కిలి సురేష్(42) తన భార్య కృష్ణవేణితో ద్విచక్రవాహనంపై దగ్గుబాడు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో పోతినవారిపాలెం గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడం జరిగింది.
గిద్దలూరు, డిసెంబర్ 9 : మోటార్బైక్ అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మండల పరిధిలోని వెల్లుపలి అటవీప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.
హిందూపురం, డిసెంబర్ 9 : లక్షలాది రూపాయలు విలువ చేసే ప్లాటినం గుండ్లు ఇస్తామంటూ నమ్మబలికి రూ.15 లక్షల టోకరా వేయాలని ప్రయత్నించిన ముఠాపై బాధితులు ఫిర్యాదు చేయడంతో ఆదివారం అరెస్టు చేసినట్లు వన్టౌన్ సీఐ చిన్నగోవిందు తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
బచ్చన్నపేట, నవంబర్ 8: ప్రమాదవశాత్తు కారు ఢీకొట్టగా ఓ మహిళ మృతి చెందిన సంఘటన శనివారం గోపాల్నగర్లో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గోపాల్నగర్కు చెందిన పుర్మ లక్ష్మమ్మ (70) తన ఇంటి ముందు ఆరుగుపై కూర్చోని ఉండగా చిన్నరామచర్ల గ్రామంవైపునుంచి వస్తున్న టిఎస్08ఎఫ్వి 8494 నెంబరుగల కారు ఆమెను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ సంఘటనలో లక్ష్మమ్మ అక్కడిక్కడే మృతి చెందింది.
అమీన్పూర్, డిసెంబర్ 8: క్వారీ గుంతలో పడి ఒక వృద్ధుడు మృతిచెందిన సంఘటన అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సీఐ ప్రభాకర్ తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అమీన్పూర్ మండల పరిధిలోని దాయర గ్రామానికి చెందిన రాములు (60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. కాగా శుక్రవారం ఇంటినుండి పొలానికి వెళ్తున్నానని తెలిపి బయటకు వెళ్లాడు.
మానకొండూర్, డిసెంబర్ 8: అత్తింటిలో వరకట్న వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంఘటన మానకొండూర మండలం శ్రీనివాస్నగర్ గ్రామంలో చోటుచేసుకుంది.
పెరవలి, డిసెంబర్ 8: అక్కా, చెల్లెళ్ల మధ్య సెల్ ఫోన్ కోసం రాజుకున్న గొడవ చినికి చినికి పెద్దదై అక్క ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లిలో విషాదాన్ని నింపింది. ఖండవల్లిలో రవళి స్పిన్నింగ్ మిల్లుకు చెందిన అపార్టుమెంట్లో నివసిస్తున్న పిక్కి భారతి (20) అనే అవివాహిత ఉరి వేసుకొని వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.