S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హీరో గోపీచంద్కు ఆశించిన స్థాయిలో మంచి విజయమే దక్కడంలేదు. దాంతో గోపీచంద్ మళ్లీ విలన్ పాత్రలు చేస్తాడని టాక్ కూడా వచ్చింది. అయితే హీరోగా ఇంకా ప్రయత్నాలు చేయాలని గోపీచంద్ భావిస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాతోపాటు గోపీచంద్ తనకు లక్ ఇచ్చిన దర్శకుడు శ్రీవాస్తో సినిమాను చేసేందుకు ఓకె చెప్పాడు.
సుమంత్, ఈషారెబ్బ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. సుధాకర్ ఇంప్లెక్స్ ఇండియా ప్రై. లి. పతాకంపై బీరం సుధాకర్రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. సుమంత్, అక్కినేని అఖిల్ ట్రైలర్ను విడుదలచేశారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ- ఇలాంటి కథ దొరకడం అంత సులభమేమీ కాదు, సుమంత్ అన్నకు దొరికింది.
సెక్సీ స్మైల్. సెక్సీ స్టిల్. ఔను, ప్రియాంక జవాల్కర్కు పరిశ్రమ పల్స్ తెలిసింది. టాక్సీవాలా ఇచ్చిన ఉత్సాహంతో మంచి జోరుమీదున్న జవాల్కర్, తెలుగు ప్రాజెక్టులు మరిన్ని పట్టాలన్న పట్టుదలతో కనిపిస్తోంది. ఈ ఉత్సాహం చూశారుగా.. డౌటు లేదు ప్రియాంకకు ప్రాజెక్టులు పడటం ఖాయం.
సమాచార భారతి సాంస్కృతిక సంస్థ వచ్చే నెల 22న రెండవ ‘కాకతీయ ఫిలిం ఫెస్టివల్’ను నిర్వహించనున్నది. భారతీయకు పునాదులైన సామాజిక బాధ్యత, కుటుంబ విలువలు, సామాజిక విలువలు పెంపొందించడం కోసం పోటీ ముఖ్య ఉద్ధేశ్యమని సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి. గోపాల్ రెడ్డి, కార్యదర్శి ఎన్. ఆయుష్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
లక్కీ మీడియా నిర్మిస్తున్న సినిమా ‘హుషారు’. తేజెస్ కంచెరల్, తేజ్ కూరపాటి, అభినవ్ చుంచు, దినేష్ తేజ్, రాహుల్ రామకృష్ణ, దక్ష నాగార్కర్, ప్రియ వడ్లమాని, హేమ ఇంగ్లి, రమ్య, అప్పాజీ, ప్రమోదిని కీలక పాత్రధారులు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. ఈ టీమ్ తెలుగురాష్ట్రాల్లో టూర్ ప్లాన్ చేసింది.
వెండితెరపై ఇప్పటికి చాలా ప్రేమకథా చిత్రాలు చూశాం. కొత్తగా ఉండే ప్రేమకథా చిత్రాలు విజయం సాధించాయి. రొటీన్ స్టోరీలు కనబడకుండా పోయాయి. అయినా దర్శకులు ప్రేమకథలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రయత్నాల్లో గీత గోవిందం ఒకటి. 2018 ఆగస్టు 15న విడుదలై అఖండ విజయాన్ని సాధించింది.
తొలి సినిమా విజేతతోనే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో కళ్యాణ్దేవ్ రెండో సినిమా ఖరారైంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. నూతన దర్శకుడు పులి వాసు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్.తమన్ అందిస్తున్నారు. ఖుర్షీద్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
మహేష్బాబు ప్రస్తుతం ‘మహర్షి’లో నటిస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్కు జోడీగా పూజాహెగ్డే నటిస్తోంది. ఇప్పటివరకూ సినిమాలో ఒకే హీరోయిన్ అని అందరూ అనుకున్నారు గానీ వంశీ మాత్రం మరో హీరోయిన్ను సెలెక్ట్ చేసి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ సినిమాలో మహేష్ మూడు విభిన్న దశలలో విభిన్న కోణాలలో కనిపిస్తాడు. స్టూడెంట్గా.. ఒక కార్పొరేట్ సంస్థకు అధిపతిగా..
ఇటీవలి కాలంలో కథానాయికలు సైతం గ్లామర్ పాత్రల కంటే పెర్ఫామెన్స్ బేస్డ్రోల్స్కే మొగ్గు చూపిస్తున్నారు. మొన్నటికిమొన్న మహానటిగా నటించిన కీర్తి సురేష్ సైతం తనకు డీగ్లామర్ రోల్స్ అంటే ఇష్టమని ప్రకటించింది. ఇప్పుడు అదేబాటలో కొత్త పంథా ఆలోచనలతో ఇతర నాయికలు ముందుకెళుతున్నారు. అమ్మ జయలలిత పాత్రలో నటించేందుకు నిత్యామీనన్ సంతకం చేసింది. ఇప్పుడు రకుల్ అదే బాటలో ప్లాన్చేస్తోంది.
సూపర్స్టార్ రజినీకాంత్ నటిస్తున్న ‘పెట్టా’ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. చిత్రవర్గాల సమాచారంమేరకు ఈ చిత్రంయొక్క ఆడియో డిసెంబర్ 16న విడుదల కానుందట. ఇక డిసెంబర్ 12న రజినీ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్ను కానీ లేదా చిత్రంలోని సాంగ్ను కానీ విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.