S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అమోఘ్ దేశ్పతి, అర్చన, శ్రేయా వ్యాస్ హీరో హీరోయిన్లుగా శేరాజ్ దర్శకత్వంలో స్వర్ణ ప్రొడక్షన్స్ పతాకంపై ఇటీవలే విడుదలైన హర్రర్ ఎంటర్టైనర్ ‘షాలిని’ చిత్రం విడుదలైన విజయవంతంగా 50 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా శనివారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దర్శకుడు శేరాజ్ మాట్లాడుతూ-షాలిని చిత్రాన్ని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు.
ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న నాని, మరో హ్యాట్రిక్ కోసం సన్నాహాలు గట్టిగానే చేస్తున్నాడు. ప్రస్తుతం ‘ఎంసిఏ’ (మిడిల్ క్లాస్ అబ్బాయి) చిత్రంలో నటిస్తున్న నాని, దాంతోపాటు మేర్లపాక గాంధి దర్శకత్వంలో ‘కృష్ణార్జునయుద్ధం’ చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్ను పూర్తిచేసుకున్న ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ చిత్రానికి కూడా ఓకె చెప్పాడట.
వెండితెరపై హీరోయిన్గా వెలగాలంటే ఎంత కష్టపడాలో ఏ హీరోయిన్ను అడిగినా చెబుతారు. అందులోనూ స్టార్ హీరోయిన్గా కొనసాగాలంటే సినిమా కష్టాలు తప్పవు. కానీ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందమామ కాజల్కు ఈమధ్య అవకాశాలు తగ్గుతున్నాయి. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్గా ఇమేజ్ తెచ్చుకున్న కాజల్కు ఆమధ్య వరుస పరాజయాలు కాస్త బ్రేక్ ఇచ్చాయి.
టాలీవుడ్లో శేఖర్ కమ్ముల అంటే ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఆయన సినిమాలు చాలా క్లాస్గా ఉంటూనే మాస్ని ఆకట్టుకుంటాయి. లేటెస్టుగా వరుణ్తేజ్, సాయిపల్లవితో చేసిన ఫిదా నిజంగా అందర్నీ ఫిదా చేసింది. ఈ సినిమా తరువాత శేఖర్ కమ్ముల తదుపరి చిత్రం ఎవరితో ఉంటుందన్న సందేహాలు ఎక్కువయ్యాయి. ఈ విషయం గురించి శేఖర్ అడిగితే, ఇప్పుడే తదుపరి సినిమా గురించి ఆలోచించడం లేదు అని చెప్పాడు.
అనుష్క ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘్భగమతి’. ‘మహానుభావుడు’ సినిమా తరువాత యు.వి క్రియేషన్స్ సంస్థ నుండి వస్తున్న సినిమా ఇది. ‘పిల్లజమిందార్’ సినిమా దర్శకుడు అశోక్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ సినిమా ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాలో గ్రాఫిక్స్కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.
పవర్స్టార్ పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ల చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కొద్దిరోజుల క్రితమే కేరళలోని చిక్మంగుళూరులో షెడ్యూల్ ప్రారంభించిన టీమ్ సుమారు మూడు రోజులపాటు షూటింగ్ జరిపి తాజాగా ముగించింది. దీంతో పవన్కళ్యాణ్ రాజకీయపరమైన పనుల్ని చక్కబెట్టుకునేందుకు హైదరాబాద్ బయలుదేరారు. ఇకపోతే త్వరలోనే టీమ్ యూరప్ వెళ్లనుందట.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 61వ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘అదిరింది’ తమిళంలో విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు కలెక్షన్లతో బ్లాక్బస్టర్ రేంజ్కి దూసుకుపోతోంది. దాదాపు 100 కోట్లకో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో కూడా గ్రాండ్గా విడుదల చేయనున్నారు. అతి త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని 400 థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
కథాబలం వున్న చిత్రాలకు, వెండితెరపై భారీతనం కురిపించిన సినిమాలకు, స్టార్ వాల్యూ, మేకింగ్ వాల్యూల అరుదైన కలయికకు కేరాఫ్ అడ్రస్ వైజయంతీ మూవీస్ సంస్థ. ఈ బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలెన్నో తెలుగువారి హృదయాల్ని గెలుచుకుని మరపురాని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు వైజయంతీ మళ్లీ పునఃవైభవం సాధించే దిశగా అడుగులేస్తోంది. వరుసగా సినిమాల్ని తెరకెక్కించే పనిలో నిమగ్నమైంది.
నేను శైలజ’ సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు కిశోర్ తిరుమల తాజాగా మళ్లీ రామ్తో కలిసి ‘ఉన్నది ఒకటే జిందగీ’తో ముందుకు రానున్నారు. ఈనెల 27న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు కిశోర్ తిరుమల చెప్పిన విశేషాలు...
సింపుల్ పాయింట్
యువ కథానాయకుడు రాజ్తరుణ్ నటిస్తోన్న డిఫరెంట్ ఎంటర్టైనర్ ‘రాజుగాడు’. వరుస విజయాలతో సక్సెస్ఫుల్ హీరోగా రాణిస్తున్న రాజ్తరుణ్.. తనకు వరుస విజయాలను అందించిన నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నటిస్తోన్న చిత్రం ‘రాజుగాడు.’ రాజ్తరుణ్ హీరోగా రూపొందించిన ‘ఈడోరకం ఆడోరకం’, ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ ‘అంధగాడు’ సినిమాలతో హ్యాట్రిక్ హీరోగా నిలిచాడు.