S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అనేది ఉపశీర్షిక. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సురేఖ కొణిదల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగా పవర్స్టార్ రామ్చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రంలో కథానాయికగా చందమామ కాజల్ను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే.
ఇటీవలే జక్కన్నతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సునీల్, ప్రస్తుతం వీరూపోట్ల దర్శకత్వంలో ‘ఈడు గోల్డెహె’ చిత్రంలో నటిస్తున్నాడు. దాదాపు షూటింగ్ పూర్తికావచ్చిన ఈ సినిమా తరువాత ఓనమాలు ఫేం క్రాంతికుమార్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్న సునీల్, తాజాగా మరో చిత్రానికి కమిట్ అయినట్లు తెలిసింది. ఎన్కౌంటర్, శ్రీరాములయ్య వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు ఎన్.శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందట.
నిర్మాత విజయ్వర్మ గతంలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు నిర్మించారు. ఇప్పుడు కోయ భాషలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుపుతున్నారు.
‘విశారణై’పేరుతో విడుదలై సంచలన విజయం సాధించడంతోపాటు ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా జాతీయ అవార్డు అందుకున్న తమిళ చిత్రం.. ‘విచారణ’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ‘ది క్రైమ్’ అన్నది ట్యాగ్లైన్. ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ సమర్పణలో కల్పనా చిత్ర పతాకంపై ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
అందాల భామ అమలాపాల్ ప్రస్తుతం తన భర్త విజయ్తో విడాకుల విషయంపై కోర్టుకెళ్లిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా ఈమధ్య అమలాపాల్ను కోలీవుడ్ దూరం పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. దానికి కారణం ఈమె ఇప్పటికే కమిట్ అయిన సినిమాలు చేజారిపోవడమే. కొత్తగా అవకాశాలు కూడా రావడంలేదట.
ప్రపంచంలో గత ఆర్థిక సంవత్సరంలో సినిమాలు, టీవీలు, ప్రకటనలు, ఇతర కార్యక్రమాల ద్వారా అత్యధిక ఆదాయం పొందిన సినీ నటీమణుల్లో హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ వరుసగా రెండోసారికూడా మొదటి స్థానంలో నిలిచింది. 2015 జూన్ 1నుంచి ఈ ఏడాది మే 31 వరకు ఆమె ఆర్జించిన ఆదాయం 46 మిలియన్ అమెరికన్ డాలర్లు.
‘ఓకె బంగారం’ విజయంతో హీరో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ల జంటకు మంచి పేరొచ్చింది. వారి కాంబినేషన్లో రూపొందిన మూడో చిత్రం ‘100 డేస్ ఆఫ్ లవ్’. మలయాళంలో రూపొందిన ఈ చిత్రాన్ని అదే పేరుతో ఎస్ఎస్సి మూవీస్ పతాకంపై ఎస్.వెంకటరత్నం నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈనెల 26న విడుదలవుతున్న సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాళీ సుధీర్ మాట్లాడుతూ, ‘అందమైన అద్భుతమైన ప్రేమకథ ఇది.
ముంబైలో ప్రారంభమైన లేక్మి ఫ్యాషన్ వీక్ ర్యాంప్పై
మెరిసిన బాలీవుడ్ నటి కంగనారనౌత్. ప్రఖ్యాత డిజైనర్ తరుణ్ తహ్లియాని రూపొందించిన దుస్తుల్లో ఆమె క్యాట్వాక్ ఆహూతులను అలరించింది.
రామ్చరణ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా సురేందర్రెడ్డి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ‘ధ్రువ’ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సెప్టెంబర్ 5తో షూటింగ్ పూర్తిచేసుకుని అదే నెలలో మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి అక్టోబర్ 7 దసరా కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ- ధ్రువ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుతున్నాం.
నందమూరి తారకరత్న హీరోగా వెంకటరమణ సాల్వ దర్శకత్వంలో ముప్పా క్రాంతి చిత్ర పతాకంపై ముప్పా అంకమ్మచౌదరి నిర్మించిన ‘ఎవరు’ చిత్రం ఈనెల 26న విడుదలవుతున్న సందర్భంగా హీరో నందమూరి తారకరత్న చెప్పిన విశేషాలు ఆయన మాటల్లో...
విభిన్నమైన కథ