S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/04/2016 - 08:03

జైపూర్: భారతదేశంలో జరిగిన అన్ని ఉగ్రవాద దాడులు పాక్ కేంద్రంగా జరిగినవేనని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర స్వరంతో స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకున్నా వాటిని బలపరచడానికి భారత్ సంసిద్ధంగా ఉందని వెల్లడించారు.

02/04/2016 - 06:47

న్యూఢిల్లీ: తెలంగాణలో 2017నాటికి రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా ఐదువేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సాధిస్తామని మంత్రి జగదీష్ రెడ్డి వెల్లడించారు. భవిష్యత్ తరాలకు ఉపాయోగపడేలా రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన నాల్గవ గ్రీన్ ఎనర్జీ సదస్సుకు మంత్రి హాజరయ్యారు.

02/04/2016 - 06:45

న్యూఢిల్లీ: మిషన్ భగీరథ తొలి ఫలితాలు తొమ్మిది నియోజకవర్గాల్లో మేలో కనిపిస్తాయని గ్రామీణాభివృద్ది, ఐటి మంత్రి కెటి రామారావు వెల్లడించారు. బుధవారం విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్వచ్చ్భారత్, జాతీయ గ్రామీణ తాగునీటిపై ఏర్పాటు చేసిన సదస్సుకు కెటిఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మిషన్ భగీరథను 2018నాటికి పూర్తి చేస్తామన్నారు.

02/04/2016 - 06:29

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొబ్బరి కనీస మద్దతు ధరను 5950గా నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. కొబ్బరి ప్రస్తుత మద్దతు ధర 5550గా ఉండగా, 2016 సంవత్సరానికి మద్దతు ధరను 5950 రూపాయలుగా నిర్ణయించారు. కమిషన్ ఫర్ కాస్ట్ అండ్ ప్రొడక్షన్ (సిఏసిపి) సిఫారసు మేరకు మద్దతు ధరను పెంచారు.

02/04/2016 - 06:27

న్యూఢిల్లీ: పఠాన్‌కోట్ ఉగ్రవాద దాడి తర్వాత పశ్చిమ సెక్టార్‌లోని అన్ని ఎయిర్‌బేస్‌ల వద్ద అనధికారికంగా లోనికి ప్రవేశించే వారిని కనిపించిన వెంటనే కాల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయినట్లు బుధవారం మీడియా కథనాలు పేర్కొన్నాయ.

02/04/2016 - 06:21

న్యూఢిల్లీ: హిమాలయాల్లోని సియాచిన్ హిమనదం ప్రాంతంలో పెద్ద ఎత్తున హిమపాతం కారణంగా ఎత్తయిన పర్వత శ్రేణుల్లోని ఈ భారతీయ సైనిక స్థావరం వద్ద కాపలా కాస్తున్న పది మంది సైనికులు మంచుకింద చిక్కుకు పోయినట్లు తెలుస్తోంది. ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జెఓసి) కూడా ఉన్న వీరంతా కూడా బిహార్ రెజిమెంట్ 19వ బెటాలియన్‌కు చెందిన వారని తెలుస్తోంది.

02/03/2016 - 18:52

దిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ తరహాలే దిల్లీలోనూ రాష్టప్రతి పాలన విధించేందుకు కేంద్రం పారిశుద్ధ్య కార్మికులను ఉసిగొలిపి సమ్మె చేయిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. దిల్లీ మున్సిపల్ కార్మికుల జీతాలకు సంబంధించి ప్రభుత్వం బకాయిలేమీ లేవని ఆయన స్పష్టం చేశారు.

02/03/2016 - 17:41

హైదరాబాద్: ప్రస్తుతం దేశదేశాలను వణికిస్తున్న జికా వైరస్‌కు తొలి వ్యాక్సిన్‌ను రూపొందించినట్లు నగరంలోని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ల్యాబ్ శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తున్న ఈ వైరస్‌కు మందు కనుగొనాలని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది.

02/03/2016 - 15:07

దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభ మాజీ స్పీకర్ బలరామ్ జక్కర్ (92) బుధవారం ఉదయం తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. పంజాబ్‌లోని ఆయన స్వగ్రామంలో గురువారం అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 1980- 89లో ఆయన లోక్‌సభ స్పీకర్‌గా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా పనిచేశారు.

02/03/2016 - 11:50

హైదరాబాద్: నగరానికి చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాది అజీజ్‌ను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఎటిఎస్ (ఉగ్రవాద నిరోధక విభాగం) పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో గణేశ్ ఆలయం పేల్చివేతకు కుట్ర పన్నిన అజీజ్‌పై పలు కేసులు విచారణలో ఉన్నాయి. 2003లో బెయిల్‌పై విడుదలైన అజీజ్ కొన్నాళ్లు సౌదీలో తలదాచుకున్నాడు. సౌదీ ప్రభుత్వం వెనక్కి పంపడంతో లక్నోలో ఉంటున్నాడు.

Pages