S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/10/2015 - 07:57

చెన్నై, డిసెంబర్ 9: తమిళనాడును అతలాకుతలం చేసిన వర్షాలు, వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జయలలిత విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు గృహ, వాహన రుణాల చెల్లింపుపై మారిటోరియం విధించాలని కోరారు. తక్షణమే తమిళనాడు వరద పరిస్థితిపై జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆమె లేఖ రాశారు. ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలందరూ దిగువ, మధ్యతరగతివారేనని అన్నారు.

12/10/2015 - 07:54

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఎన్‌డిఏ ప్రభుత్వం తమ అధినాయకులపై రాజకీయ కక్ష సాధింపుచర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు బుధవారం కూడా పార్లమెంటు ఉభయ సభలను స్తంభింపజేశారు.

12/10/2015 - 07:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పార్లమెంట్ సమావేశాలను వ్యక్తిగత ప్రయోజనాలకోసం స్తంభింపజేస్తున్న కాంగ్రెస్ పార్టీ దేశానికి అత్యంత ప్రమాదకర శక్తిగా మారుతోందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం వెంకయ్య నాయుడు ఆరోపించారు. పార్లమెంట్‌ను స్తంభింపజేసి ఎన్నికలలో తమ పార్టీని ఓడించినందుకు ప్రజలపై ప్రతీకారం తీర్చు కుంటోందని ఆయన తీవ్రంగా ఆరోపించారు.

12/10/2015 - 07:47

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచార బాధితుల్లో 46 శాతం మంది మైనర్‌లేనని ఓ నివేదికలో వెల్లడైంది. 2013లో 1,636 అత్యాచారం ఘటనలు చోటుచేసుకోగా అందులో 757 మంది బాధితులు మైనర్‌లే. 2014లో 2,166 అత్యాచారం కేసులు నమోదుకాగా వెయ్యి నాలుగు మంది బాధితులు మైనర్‌లేనని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

12/10/2015 - 07:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం 69వ జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌తోపాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు ఈ రోజు ఉదయం 10, జనపత్‌కు వెళ్లి ఆమెకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

12/10/2015 - 07:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: పప్పుల ధరలు రోజురోజుకు పెరుగుతూ కిలో ఒక్కంటికి రూ. 190కి చేరడంతో పప్పు ధాన్యాల ఆపద్ధర్మ నిల్వలను (బఫర్ స్టాక్)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఇందుకోసం 1.5 లక్షల టన్నుల కాయధాన్యాలను సేకరించాలని, రిటెయిల్ మార్కెట్‌లో పప్పుల ధరలు పెరిగినప్పుడు వీటిని మార్కెట్‌లోకి విడుదల చేయాలని నిర్ణయించింది.

12/10/2015 - 07:17

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తెలంగాణలో కరవు పరిస్థితులను ఎదుర్కొని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే వెయ్యి కోట్లు కేటాయించాలని టిఆర్‌ఎస్ సభ్యుడు భీంరావుపాటిల్ డిమాండ్ చేశారు.

12/10/2015 - 07:04

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: ఆంధ్రప్రదేశ్‌లోని కరవునెలకొన్న ప్రాంతాల్లోని రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేయాలని వైకాపా ఎంపీ బుట్టా రేణుక కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రేణుక బుధవారం లోక్‌సభలో కరువుపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఈ విజ్ఞప్తి చేశారు. రైతుల పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించక తీవ్ర నష్టాలకు గురవుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

12/10/2015 - 06:56

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: చాలా రోజుల తర్వాత ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒకే వేదికపై కలిశారు. అయితే అది ప్రైవేటు కార్యక్రమం. అనుకోకుండా ఎదురుపడిన ఇద్దరు ముఖ్యమంత్రులూ నమస్కార, ప్రతి నమస్కారాలతో సరిపెట్టుకున్నారు. పెదవి విప్పి ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇంతకీ వీరి కలయికకు వేదికైంది... కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లి కుమార్తె వివాహ సందర్భాన్ని పురస్కరించుకుని ఇచ్చిన విందు కార్యక్రమం.

12/10/2015 - 06:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం సాయంత్రం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్‌ను కలిసి ప్రత్యేక హైకోర్టుపై చర్చించారు. మొదట ఆయన ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టినందుకు జస్టిస్ ఠాకూర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. అనంతరం రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు ఆవశ్యకతపై వివరించారు.

Pages