హరితహారం వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి
Published Thursday, 27 April 2017మహబూబ్నగర్, ఏప్రిల్ 26: జిల్లాలో గత సంవత్సరం హరితహారంలో నాటిన మొక్కలు వివిధ శాఖల వారిగా పూర్తి వివరాలతో పాటు బతికున్న మొక్కలను ఈ వేసివిలో నీరు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్రోస్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏ ఏ ప్రదేశాలలో ఎన్ని మొక్కలు నాటారో మొక్కల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. వచ్చే జూన్,జూలై నాటికి హరితహారం యాక్షన్ ప్లాన్ను తయారుచేసుకోవాలని తెలిపారు.