కాళ్లవాపు వ్యాధితో గిరిజనుడికి అస్వస్థత
Published Friday, 23 September 2016చింతూరు, సెప్టెంబర్ 23: చింతూరు మండలం వాలమూరిగొంది గ్రామానికి చెందిన సోడే కృష్ణమూర్తి అనే గిరిజనుడు కాళ్ల వాపు వ్యాధి సోకి గత రెండు వారాలుగా బాధపడుతున్నాడు. శుక్రవారం కాళ్ల నొప్పులు ఎక్కువ కావడంతో చింతూరు క్లస్టర్ వైద్యశాలకు వచ్చి, వైద్యం పొందుతున్నాడు. చాపకింద నీరులా కాళ్లవాపు వ్యాధి ప్రబలడంతో ఏజెన్సీలోని గిరిజనులు భయాందోలలకు గురవుతున్నారు.