అభివృద్ధికే పెద్దపీట
Published Friday, 23 September 2016ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికే పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం కూసుమంచి మండలంలోని రాజుతండా నుంచి ఒంటిగూడిసెతండా వరకు 130లక్షల వ్యయంతో నిర్మించనున్న బిటి రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగా ఒక్కొక్క పనిని పూర్తి చేస్తూ అన్ని రంగాల్లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. రోడ్డును త్వరిగతిన పూర్తి చేసి ప్రజల సౌకర్యవంతంగా చూడాలన్నారు.