రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Published Friday, 23 September 2016బాలానగర్, సెప్టెంబర్ 23: బాలానగర్ మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దాంతో ఆయన మృతి చెందాడు. బాలానగర్ మండలం నందారం గ్రామ పంచాయతీ పరిధిలోని మచారం తాండకు చెందిన తులసీనాయక్(33)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడిక్కకడే మృతి చెందాడు. బాలానగర్లో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండా అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. డీకొట్టిన వాహనం అక్కడ నిలవకుండా మరింత వేగవంతో వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు గ్రామస్తులు సమాచారం అందించారు.