నిండు కుండలా పోగొండ!
Published Friday, 23 September 2016బుట్టాయగూడెం, సెప్టెంబర్ 23: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల్లో ఊపిరి పోసుకుని, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలనాపాలనతో జీవం నింపుకున్న మెట్టరైతన్నల మానసపుత్రిక పోగొండ ప్రాజెక్టు వరదనీటితో నిండి, నీళ్లాడిన నిండు చూలాలిని తలపిస్తుంది. మండలంలోని చింతలగూడెం సమీపంలో సుమారు నాలుగేళ్ల క్రితం రూ.27కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేసుకున్న పోగొండ ప్రాజెక్టు, నిర్మాణవ్యయం పెరిగి రూ.85కోట్ల వ్యయంతో, ఎన్నో బాలారిష్టాలను దాటుకుని, పూర్తయ్యే దశకు చేరుకుంది.