మొదలైన సోమవారం సమీక్షలు
Published Tuesday, 20 September 2016పోలవరం, సెప్టెంబర్ 19: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి సోమవారం సమీక్షలు మొదలయ్యాయ. 2018 నాటికి పోలవరం పూర్తిచేయాలనే లక్ష్యంలో భాగంగా ప్రతి సోమవారం పనులను వర్చువల్ విధానంలో సమీక్షిస్తానని, నెలలో మూడో సోమవారం ప్రాజెక్టును సందర్శించి పరిశీలిస్తానని ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన సంగతి విదితమే. అందులో భాగంగా సోమవారం విజయవాడ నుండి ముఖ్యమంత్రి పనులపై వర్చువల్ సమీక్ష జరిపారు. ఉదయం 10 నుండి రెండున్నర గంటల పాటు సమీక్షించారు. సిఎంకు నిర్మాణ పనులు చూపించేందుకు డ్రోన్ కెమెరాతోపాటు స్టాండ్పై కెమెరాలు ఏర్పాటుచేశారు.