డెంగ్యూ, మలేరియా పట్ల అప్రమత్తంగా ఉండాలి
Published Tuesday, 20 September 2016మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 19: డెంగ్యూ, మలేరియా వ్యాధులు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం స్థానిక కోనేరుసెంటరులో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డెంగ్యూ, మలేరియాపై అవగాహన, ప్రచార ర్యాలీ వాహనాలను మంత్రి రవీంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 19వ తేదీ నుంచి అక్టోబరు 18వ తేదీ వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా డెంగ్యూ, మలేరియా వ్యాధి నివారణలపై గ్రామ గ్రామాలలో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత అవసరమన్నారు.