S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్‌ఎస్‌ఎస్ సేవల విస్తృతికి ప్రణాళిక

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 19: జిల్లాలో ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎన్‌ఎస్‌ఎస్ జిల్లా ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ చొప్ప సూర్యనారాయణ అన్నారు. స్థానిక ఆంధ్రవిశ్వవిద్యాలయం ప్రాంగణం (ఎయుకేంపస్)కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎన్‌విఎస్ సూర్యనారాయణను జిల్లా సహాయ ప్రోగ్రాం అధికారిగా నియమించారు. ఎంఆర్ కళాశాలలో సోమవారం జరిగిన ప్రోగ్రాం అధికారుల సదస్సులో సూర్యనారాయణకు నియామక పత్రాలను అందజేశారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలి

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని, ప్రత్యేక ప్యాకేజీలు అవసరం లేదని ఆమ్‌ఆద్మీపార్టీ జిల్లా కన్వీనర్ జి.పుష్పనాధం అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీల వల్ల ప్రయోజనం లేదని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తేనే అన్నివిధాలా ఉపయోగం ఉంటుందని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని రాష్ట్రప్రజలు గగ్గోల పెడుతున్నా బిజెపి ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా తప్ప ఏ ప్యాకేజీ అవసరం లేదని తెలిపారు. అవినీతిపరులు పంచుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీలు బాగా ఉపయోగపడతాయని ఆరోపించారు.

వైస్సార్‌నగర్ కాలనీవాసుల ధర్నా

విజయనగరం (్ఫర్టు), సెప్టెంబర్ 19: పట్టణ శివారులో ఉన్న వైఎస్సార్ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవయువ సమాఖ్య(ఎన్‌వైఎస్) ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. సమస్యల పరిష్కారంలో ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణను నిలదీశారు. రోడ్లు, కాలువలు లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని, పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

సమన్వయంతో వ్యాధులను నిర్మూలించాలి

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 19: వ్యాధుల నిర్మూలనకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ వివేక్‌యాదవ్ కోరారు. ఈనెల 29వ తేదీ వరకు గ్రామాల్లో నిర్వహించే ప్రత్యేకపారిశుద్ధ్య కార్యక్రామాన్ని ఆయన డెంకాడ మండలం పెదతాడివాడలో ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల కారణంగా ఏ ఒక్కరూ రోగాల బారిన పడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. గ్రామంలో అపారిశుద్ధ్యం ఎక్కడా ఉండకుండా ఎప్పటికప్పుడు చెత్త, మురగునీరు తొలగించాలని, దోమలు వ్యాపించకుండా నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు.

సమస్యలపై స్పందించకపోతే చర్యలు

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 19: గ్రామాల్లో ప్రజా సమస్యలపై స్పందించని సిబ్బందిపై చర్యలు తప్పవని జాయింట్ కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ నుండి ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. బాడంగి మండలం గొల్లాది ఎస్సీకాలనీలో నెలకొన్న అపారిశుద్ధ్యంపై కార్యదర్శి స్పందించడం లేదని, సర్ట్ఫికెట్ల విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని వార్డు మెంబర్ ఫిర్యాదుపై స్పందించిన జెసి ఎంపిడిఓపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారికి అదేశించారు.

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

విజయనగరం(టౌన్), సెప్టెంబర్ 19: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండి వాటిని నిరోధించాలని స్ర్తిశిశుసంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రచార వాహనాన్ని ఆమె సోమవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవాహనంద్వారా జిల్లాలోని మారుమూల గ్రామాలకు, గిరిజన గ్రామాల్లో సీజనల్ వ్యాధుల వాటిని నిర్మూలాంచడానికి తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. దోమల కారణంగా వచ్చేమలేరియా, ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

మొక్కలు పెంచాలి

తాడేపల్లిగూడెం, సెప్టెంబర్ 19: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచాలని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. సోమవారం రూరల్ మండలం పుల్లాయిగూడెం గ్రామంలో రోడ్డుకిరువైపులా మంత్రి మాణిక్యాలరావు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు మొక్కలు అధిక సంఖ్యలో పెంచాలన్నారు. మాజీ సర్పంచ్ రామావతారం ఆధ్వర్యంలో పుల్లాయిగూడెంలో 125 మొక్కలు నాటడం అభినందనీయమన్నారు. పుల్లాయిగూడెంలో మంచినీటి కోసం 2వ ఓవర్ హెడ్‌ట్యాంక్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి గ్రామంలో వౌలిక వసతులు కల్పిస్తామన్నారు.

ఆర్థికంగా ఢాం!

ఏలూరు, సెప్టెంబర్ 19 : ఒకప్పుడు పశ్చిమ జడ్పీ అంటే నిధులతో కళకళలాడే పెద్ద సంస్థగా అందరికీ తెలుసు. కానీ ఆ పరిస్థితి చాలా వరకు మారిపోయింది. ప్రస్తుతం జిల్లా పరిషత్ ఆర్ధిక ఇబ్బందుల్లో వుందనే చెప్పుకోవచ్చు. ఒకప్పటి నిధుల రాక పూర్తిగా రూటు మారిపోవడంతో జడ్పీకి జమ అవుతున్న ప్రభుత్వ నిధుల పరిమాణం దారుణంగా పడిపోయింది. దీనితో ప్రస్తుతం జడ్పీ ఆ ఇబ్బందుల్లోనుంచి బయటపడేందుకు ఆర్ధిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు వనరుల కోసం అనే్వషణ ప్రారంభించింది. జడ్పీ ఆర్ధిక పరిస్థితిని ఒక్కసారి పరిశీలిస్తే 2000 సంవత్సరంలో జిల్లా పరిషత్ వంద కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టాయి.

రైల్వే స్టేషన్ల నుండి ప్రత్యేక బస్సులు

ఏలూరు, సెప్టెంబర్ 19 : విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునీకరణ నేపధ్యంలో ఈ నెల 21వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వివిధ రైళ్ల రాకపోకల మార్పులు, మళ్లింపుల నేపధ్యంలో జిల్లాలోని అయిదు డిపోల నుంచి ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్‌టిసి సర్వీసులను ఏర్పాటుచేస్తున్నామని సంబంధిత ఆర్ ఎం ఎస్ ధనుంజయరావు తెలిపారు. ఈ ప్రక్రియపై సోమవారం తన కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఎస్ మురళీకృష్ణ తదితర సిబ్బందితో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు రైల్వేస్టేషన్ల నుంచి ప్రత్యేక సర్వీసులను ఏర్పాటుచేస్తున్నామని పేర్కొన్నారు.

21 నుండి 24 వరకు ఏలూరు మీదుగా శేషాద్రి

ఏలూరు, సెప్టెంబర్ 19 : విజయవాడ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ నేపధ్యంలో కాకినాడ నుంచి బెంగుళూరు వెళ్లే శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21, 22, 23, 24 తేదీల్లో దారి మళ్లిస్తున్నామని, లూప్‌లైన్ నుంచి మెయిన్ లైన్ మీదుగా వెళుతుందని ఏలూరు రైల్వే స్టేషన్ మాస్టర్ ఎవి సత్యనారాయణరావు తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు శేషాద్రి ఎక్స్‌ప్రెస్ నిడదవోలు నుంచి తణుకు మీదుగా వెళ్లేదని, ఇప్పుడు తాడేపల్లిగూడెం, ఏలూరు మీదుగా బెంగళూరు వెళుతుందని చెప్పారు.

Pages