నెమ్మలూరు సభలో అవమానపర్చారు
Published Tuesday, 20 September 2016పామర్రు, సెప్టెంబర్ 19: పామర్రు మండలం నెమ్మలూరు వద్ద సోమవారం బెల్ కంపెనీ విస్తరణ ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేసిన తనను అధికార పార్టీ, అధికార యంత్రాంగం అవమానపర్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శించారు. స్థానిక వైకాపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పామర్రు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వం వివక్ష చూపుతుందన్నారు. గెలిచిన ఎమ్మెల్యేకి గుర్తింపు ఇవ్వకుండా అధికారులు ఓడిపోయిన టిడిపి నేతకు గుర్తింపు ఇవ్వటం సమంజసం కాదన్నారు.