బీసీలకు సామాజిక భద్రత కల్పించాలి
Published Wednesday, 31 August 2016గుంటూరు, ఆగస్టు 30: దేశానికి స్వాతంత్య్రం లభించి 69 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ బిసిలకు సామాజిక భద్రత కరవైందని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈడె మురళీకృష్ణ డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట బిసి సంక్షేమ సంఘం నాయకులు, కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ దేశంలోని 70 కోట్లమంది బిసిలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఇప్పటికీ కల్పించలేదన్నారు. ఉద్యోగులకు ప్రమోషన్లు అమలుచేయాలని, జడ్జిల నియామకాల్లో కూడా ప్రాధాన్యత కల్పించాలని కోరారు.