వేరుశెనగ రైతులను ఆదుకుంటాం..
Published Wednesday, 31 August 2016కంబదూరు, ఆగస్టు 30 : రక్షక తడులను అందించి వేర్జుఇనగ పంటలను కాపాడుతామని జిల్లా ఇన్చార్జి మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని కదిరి దేవరపల్లి, అండేపల్లి, గుత్తిరెడ్డిపల్లి, ఓబుగానిపల్లిలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెయిన్ గన్లను ఉపయోగించి వేరుశెనగ పంటను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బోరు బావులు ఉన్న రైతులు ఇతర రైతులకు రక్షకతడులు అందించేందుకు సహకరించాలని కోరారు. పది రోజుల ముందుగా రెయిన్గన్లను పంపిణీ చేయాల్సి ఉంన్నిందని రైతులు మంత్రిని కోరారు. కృష్ణా పుష్కరాల వల్ల సకాలంలో రైతులకు అందించలేకపోయామని, అయినప్పటికీ రక్షక తడులతో పంటలను కాపాడుతామన్నారు.