ట్యాంకర్ల ద్వారా వేరుశెనగ పంటలకు నీరందించాలి
Published Wednesday, 31 August 2016సుండుపల్లె, ఆగస్టు 29: మండలంలో వేరుశెనగ పంట వేసుకున్న రైతులు ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని రాజంపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రభాకర్పిళ్లై తెలిపారు. మండలంలోని గుండ్లపల్లె, జి.రెడ్డివారిపల్లెతో పాటు పలు ప్రాంతాల్లో వేరుశెనగ పంటలను ఏవో పవన్కుమార్ ఆధ్వర్యంలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్యాంకర్ల ద్వారా వేరుశనగ పంటకు నీరందించాలని దానికి రైతులందరూ మండల అధికారులతో కలిసి వారికి రావాల్సిన సహాయ సహకారాలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అలాగే నీటిని తడిపేందుకు అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని ఆయన రైతులకు తెలిపారు.