ఓసి బొగ్గుగనిలో అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలి
Published Wednesday, 31 August 2016సత్తుపల్లి, ఆగస్టు 30 : గత రెండేళ్ళ క్రితం సత్తుపల్లి జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్ బొగ్గుగనిలో జరిగిన అవినీతికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సింగరేణి బొగ్గుగనుల హెచ్ఎంఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ డిమాండ్ చేశారు. మంగళవారం సత్తుపల్లిలో హెచ్ఎంఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో షేప్ నిధులు ఖర్చు పెట్టల్సి ఉండగా మంత్రులు, ఎమ్మెల్యేల ప్రోద్బలంతో ఇష్టారాజ్యంగా నిధులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.