శక్తిశాలి భారత్ మోడీ లక్ష్యం
Published Monday, 29 August 2016గుంటూరు, ఆగస్టు 28: ప్రపంచ దేశాల సరసన భారత్ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ అహరహం శ్రమిస్తున్నారని బిజెపి జాతీయ నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. భారతీయ జనతా పార్టీ అర్బన్ జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రశిక్షణ మహాభియాన్ శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిసాయి. ముగింపు సమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన వీర్రాజు మాట్లాడుతూ కేంద్రంలో అధికారం చేపట్టిన రెండేళ్లలోనే ప్రధాని మోడీ అవినీతి మరకలేని జనరంజక పాలన అందిస్తున్నారని తెలిపారు. యూపిఏ హయాంలో జరిగిన 2జి స్పెక్ట్రం బొగ్గు కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపించడంతో పాటు వేలం ద్వారా లక్ష కోట్ల ఆదాయం వచ్చేందుకు కృషి చేశారన్నారు.