నదుల అనుసంధానంతో సస్యశ్యామలం
Published Monday, 29 August 2016తాడేపల్లిగూడెం, ఆగస్టు 28: నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సిఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం మహోన్నతమైనదని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. ఆదివారం రూరల్ మండలం మాధవరం గ్రామంలో నిర్మించిన సహకార బ్యాంకు ఎరువుల గొడౌన్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ గోదావరి - కృష్ణా, కృష్ణా - పెన్నా నదుల అనుసంధానంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. ప్రధానమంత్రి ఫసలీ బీమా యోజన పథకం రైతుల పాలిట వరమన్నారు. వరి పంట కోత తర్వాత పదిహేను రోజులు ఇన్సూరెన్స్ అమలులో ఉంటుందన్నారు.