విభజనలో ఏదీ శాస్ర్తియత?
Published Monday, 29 August 2016షాద్నగర్, ఆగస్టు 28: రాష్ట్రంలో నూతన జిల్లాలు, మండలాల ఏర్పాటు శాస్ర్తియ పరంగా చేపట్టేందుకు ప్రభు త్వం కృషి చేయాలని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షుడు, ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆదివారం మహ బూబ్నగర్ జిల్లా షాద్నగర్లో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుపై పూర్తి స్థాయి వేసి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన తరువాతే నూతన జిల్లాలు, మండలల పునర్విభజన చేపట్టాలని డిమాండ్ చేశారు. మహబూబ్నగర్ జిల్లాలో షాద్నగర్, కొడంగల్, కల్వకుర్తి నియోజకవర్గాలను రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు.