నోరు జారొద్దు
Published Monday, 29 August 2016హైదరాబాద్, ఆగస్టు 28: జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదాకు ఉద్యమించి, లక్ష్యాన్ని సాధిస్తానంటే ఎంపీలంతా పవన్ వెంటనే నడుస్తామని అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, తామంతా ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి చంద్రబాబు ఆధ్వర్యంలో ఉద్యమిస్తున్నామన్నారు. పార్లమెంటులో కూడా పోడియం వద్దకు వెళ్లి రోజుల తరబడి నినాదాలు చేశామని, అన్ని పార్టీల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్లకార్డులుపట్టుకున్నామన్నారు. ఇంతకంటే పార్లమెంటరీ వ్యవస్ధలో ఏమి చేయగలమన్నారు.