భయం గుప్పిట్లో కుక్కలగుడూర్
Published Friday, 29 July 2016గోదావరిఖని, జూలై 28: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్లోకి రోజు రోజుకు వరద ఉద్ధృతి పెరుగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో నీటి మట్టం విపరీతంగా పెరిగిపోతూ ముంపు గ్రామాల నిర్వాసిత కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయ. గురువారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్లో పాక్షికంగా ముంపునకు గురైన రామగుండం మండలంలోని కుక్కలగుడూర్ గ్రామ శివారు ప్రాంతాల్లోకి ప్రాజెక్ట్ నీరు చొచ్చుక రావడంతో గ్రామస్థులు జంకుతున్నారు. ఏక్షణాన ఏ ఉపద్రవం ముంచుకు వస్తుందోనని.. ప్రాజెక్ట్లో నీటి మట్టం మరింతగా పెరిగితే గృహాలన్ని జల దిగ్బంధం అవుతుందని కుక్కలగుడూర్ గ్రామస్థులు జాగరణ చేస్తున్నారు.