నాటిన మొక్కలపై నివేదికలు సమర్పించాలి
Published Thursday, 28 July 2016సంగారెడ్డి టౌన్, జూలై 28: హరితహారంలో భాగంగా జిల్లావ్యాప్తంగా నాటిన మొక్కలపై ఖచ్చితమైన సమాచారం సమర్పించాలని జిల్లా కలెక్టర్ రోనాల్డ్రోస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో హరితహారంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హరితహారంపై అధికారులు సమర్పించే నివేదికల్లో సమన్వయం కొరవడుతోందని, మండల వారీగా ఖచ్చితమైన సమాచారం సమర్పించాలని ఆదేశించారు. రోజువారీగా మూడు రకాల ప్రొఫార్మాలలో ప్రభుత్వానికి హరితహారం నివేదికలు పంపాల్సి ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు.