ఇదేమి అన్యాయ ం...!
Published Thursday, 28 July 2016నల్లగొండ, జూలై 28: టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినా నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రభుత్వం జాప్యం చేస్తుండటం పట్ల గులాబీ తమ్ముళ్లు గుస్సా వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ జిల్లా, నియోజకవర్గ, మండల నేతలు కార్పోరేషన్ పదవులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, దేవాలయ కమిటీల చైర్మన్లపై ఆశలు పెట్టుకున్నారు. వారి ఎదురుచూపులు రెండేళ్లు గడిచినా ఫలించకపోతుండటం..పైగా కొత్త జిల్లాల ఏర్పాటు పిదపనే నామినేటెడ్ పదవుల భర్తీకి ప్రభుత్వం యోచిస్తుండంతో మరికొంత కాలం నిరీక్షణ తప్పని దుస్థితి నెలకొంది.