మాజీ ఎమ్మెల్యే విఠల్రావ్ దేశ్పాండే కన్నుమూత
Published Thursday, 28 July 2016ఆదిలాబాద్, జూలై 28: ఆదిలాబాద్ మాజీ శాసన సభ్యుడు విఠల్రావు దేశ్పాండే (84) గురువారం హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు. 1932 ఫిబ్రవరి 1న జన్మించిన విఠల్రావ్ దేశ్పాండే గత రెండు నెలలుగా శ్వాసకోశ సంబంధ వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు రోజుల కిందటే పరిస్థితి విషమించడంతో ఆయనను హైదరాబాద్ కేర్ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిరాడంబరజీవిగా, నిజాయితీ శాసన సభ్యునిగా జిల్లాలో పేరున్న గాంధేయవాధి విఠల్రావ్ దేశ్పాండే ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు.