ఉనికిని కాపాడుకునేందుకే ప్రైవేటు బిల్లు
Published Friday, 22 July 2016దిల్లీ: కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకే ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టిందని కేంద్రమంత్రి సుజనాచౌదరి ఆరోపించారు. ఆప్ సభ్యుడిపై చర్చకు కాంగ్రెస్ సహకరించి ఉంటే గంటన్నర తర్వాత ప్రైవేటు బిల్లుపై చర్చకు అవకాశం వచ్చేదన్నారు. గందరగోళం సృష్టించి సభ వాయిదా పడేలా కాంగ్రెస్ చేసిందన్నారు.