కేంద్ర నిధులతోనే రాష్ట్భ్రావృద్ధి
Published Wednesday, 20 July 2016వెంకటాచలం, జూలై 19: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీని విమర్శించడం సరికాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి అన్నారు. వెంకటాచలంలో మంగళవారం బిజెపి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సురేంద్రరెడ్డి మాట్లాడుతూ విభజన బిల్లులో హోదాపై ప్రస్తావించని కారణంగా హోదా ఇవ్వటం సాధ్యపడటం లేదన్నారు. అయితే అంతకుమించి 1.47 లక్షల కోట్ల నిధులను కేంద్రం రాష్ట్భ్రావృద్ధికి కేటాయించిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కమిటీల్లో టిడిపి కార్యకర్తలతోపాటు బిజెపి కార్యకర్తలకు కూడా చోటు కల్పించాలని ఆయన కోరారు.