హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారు
Published Wednesday, 20 July 2016రామచంద్రపురం, జూలై 19: చదువుచెప్పించి, వివాహం చేస్తామని తల్లిదండ్రులకు హామీయిచ్చి, ఎనిమిదేళ్ల బాలికను ఇంట్లో పనిమనిషిగా పెట్టుకుని, ఆమెతో బలవంతంగా శారీరక సంబంధం ఏర్పరచుకుని, చివరకు ఆమెను హత్యచేసి, ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘాతుకమిది. ద్రాక్షారామ పోలీసు స్టేషన్ పరిధిలోని తాళ్ళపొలం గ్రామంలో గత నెల 7వ తేదీ రాత్రి పప్పుల ఆదిలక్ష్మి అనే బాలిక ఉరివేసుకుని మృతిచెందినట్టు అందిన ఫిర్యాదుపై పోలీసులు జరిపిన దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.