వేంసూరు, చౌడవరం చెరువులకు గోదావరి జలాలు తెస్తాం
Published Wednesday, 20 July 2016వేంసూరు, జూలై 19: ఎన్ని ఆటంకాలు ఎదురైనా తమ్మిలేరు రాకపోయినా సీతారామ ప్రాజెక్టుద్వారా మూడు నాలుగేళ్లలో చౌడవరం, వేంసూరు చెరువులకు గోదావరి జలాలను తీసుకొచ్చి సస్యశామలం చేస్తానని రాష్ట్ర రోడ్డు భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళ వారం మండలంలోని చౌడవరం లోరూ.24 లక్షల వ్యయంతోనిర్మించిన మంచినీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. అదే విధంగా రూ.10 కోట్లతో గూడూరు ఎత్తిపోతల పథకాలకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామ ప్రాజెక్టు కోసం వారంలో టెండర్లు పిలుస్తున్నామన్నారు. ఇకనుండి లిఫ్టుల పని తీరు బాధ్యత ప్రభుత్వానిదేనని, వాటిని చూసుకోవాల్సిన బాధ్యత రైతులదేనన్నారు.