అమరనాథ్ యాత్రలో చిక్కుకున్న జిల్లావాసులు
Published Wednesday, 20 July 2016ఏలూరు, జూలై 19 : ఆకస్మికంగా అమర్నాధ్ యాత్రను రద్దు చేయడంతో ఏలూరు నగరం అంబికా ట్రావెల్స్ ద్వారా వెళ్లిన దాదాపు వంద మంది యాత్రీకులు శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. గత మూడు రోజుల క్రితం యాత్రను రద్దు చేయడంతో దాదాపు అయిదు కిలోమీటర్ల దూరం ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోవడంతో యాత్రీకులు ఇబ్బందులు పడుతున్నారు. యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు ఎప్పటికప్పుడు చెప్పడమేగానీ కొనసాగించకపోవడంతో అక్కడికక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ట్రాఫిక్ నిలచిపోవడం వలన వెనక్కి వచ్చే మార్గం కూడా లేక అక్కడే ఉండిపోయినట్లు అంబికా ట్రావెల్స్ అధినేత పైడి భీమేశ్వరరావు తెలిపారు.