ప్రేమ స్వరూపునికి పుష్పాభిషేకం
Published Wednesday, 20 July 2016గుంటూరు (కల్చరల్), జూలై 19: మహాపర్వదినాల్లో ఒకటిగా ఉన్న గురుపౌర్ణమి మహోత్సవాన్ని మంగళవారం నగరంలోని వివిధ డివిజన్లలో ఆయా భక్తబృందాలు, పలు ధార్మిక సంస్థల ఆధ్వర్యాన రోజంతా మహా వైభవంగా జరుపుకున్నారు. అష్టాదశ పురాణాలను యావత్ విశ్వానికి అందించి, రుషిలోక అరాధ్యుడుగా విఖ్యాతిపొందిన శ్రీవ్యాస భగవానుని జన్మదినాన్ని ప్రతియేటా గురుపౌర్ణమి ఉత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నది. ఇదేరోజున కోట్లాది మంది ఆరాధించే సాయినాథుడు కూడా షిరిడి ప్రాంతంలో అవతరించడాన్ని పురస్కరించుకుని స్వామివారి భక్తులంతా ఉత్సవాన్ని శ్రద్ధాశక్తులతో జరుపుకుంటున్నారు.