జూలై 1న దొర
Published Sunday, 19 June 2016తమిళంలో జాక్సన్దొరైగా రూపొందిన చిత్రాన్ని తెలుగులో ‘దొర’ పేరుతో అందిస్తున్నారు. రత్నా సెల్యులాయిడ్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో సత్యరాజ్, అతని కుమారుడు శిబిరాజ్ నటించారు. బిందుమాధవి కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని జక్కం జవహర్బాబు తెలుగులో అందిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ, తమిళంలో పీరియాడికల్ హారర్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఈనెల 21న విడుదల చేసి, సినిమాను జూలై 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామన్నారు. హారర్ చిత్రాల ప్రేమికులకు ఈ సినిమా సరికొత్తగా వుంటుందని ఆయన అన్నారు.