క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశం
Published Sunday, 19 June 2016హైదరాబాద్, జూన్ 18: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆక్రమిత స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియను మరోసారి యుఎల్సి భూములకు వర్తింపచేసింది. దీనికి ప్రత్యేకంగా జీవో నంబర్ 92ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టానికి లోబడి ప్రభుత్వానికి అప్పగించిన భూముల్లో ఆక్రమించుకున్న భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లాలో సుమారు 600 ఎకరాల ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పించగా హైదరాబాద్ జిల్లాలోని సుమారు 71 ఎకరాల ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పిస్తోంది.